జొమాటో వివాదం.. ఎంత ఫన్నీగా మారిపోయిందంటే..

  • IndiaGlitz, [Thursday,March 18 2021]

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో వివాదం గత కొద్ది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. జొమాటో బాయ్‌ తనపై దాడి చేశాడంటూ బెంగళూరు యువతి రక్తమోడుతున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతటితో ఆగక అతనిపై కేసు నమోదు చేసింది. తరువాత డెలివరీ తన తప్పేం లేదంటూ తన వర్షన్ తాను వినిపించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్లంతా రెండు వర్గాలుగా చీలిపోయి మరీ ఎవరికి కరెక్ట్ అనిపించిన వారి తరుఫున వారు మద్దతుగా నిలిచారు. సెలబ్రిటీలు సైతం ఈ వివాదంపై స్పందించడం విశేషం.

ఇదంతా ఇప్పుడెందుకు? అంటే జొమాటో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి సీరియస్‌గా కాదులెండి ఫన్నీగా. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్‌, ఫన్నీ వీడియోస్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఫస్ట్ యువతి వర్షన్‌కి సంబంధించి తీసుకున్నారు. తరువాత జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ వర్షన్ తీసుకుని స్ఫూఫ్ చేశారు. ఇక అక్కడి నుంచి నెటిజన్లు, సెలబ్రిటీలు అంతా ఎవరి వాదన వారు వినిపించడం అంతా ఓ వీడియో చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు నెటిజన్లు అసలు విషయాన్ని మరిచి ఈ ఫన్నీ వీడియోకే ఎక్కువగా ఓటేస్తున్నారు.

More News

క్రేజ్‌తో ఫ్యాన్స్ రేట్ ద‌క్కించుకున్న‌ 'రంగ్ దే'

నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 26న విడుద‌ల‌వుతుంది. నితిన్‌, కీర్తి జంట‌తో పాటు వెంకీ తెర‌కెక్కించిన

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే...

2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు

వరుణ్ ఆ అమ్మాయినే చేసుకుంటానంటే ఏం చేస్తారు?: నాగబాబుతో నెటిజన్

లాక్‌డౌన్ సమయం ఎవరికి ఎలా ఉన్నా కూడా యంగ్ హీరోలకు మాత్రం బాగా కలిసొచ్చింది. చాలా వరకూ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. ఇక ఇండస్ట్రీలో మిగిలిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్

‘నార‌ప్ప‌’ నుంచి మ‌ణిశ‌ర్మ వాకౌట్ ?

విక్టరీ వెంకటేశ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నారప్ప‌’. సురేష్ ప్రొడక్ష‌న్స్ , వి క్రియేషన్స్ పతాకాలపై కలైపులి థాను, డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు.

‘బాహుబలి’ చెత్తగా ఉందని.. డస్ట్‌బిన్‌లో పడేయమన్న నెట్‌ఫ్లిక్స్.. నెటిజన్ల ఫైర్

సినీ ఇండస్ట్రీ అంటే ‘బాహుబలి’కి తర్వాత.. ముందు అన్నట్టుగా మారిపోయాయి పరిస్థితులు. నిజానికి ఈ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇదొక సెన్సేషన్.