close
Choose your channels

YSRCP:అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీల 4వ జాబితా విడుదల

Friday, January 19, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే వరుసగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ పోతోంది. తాజాగా విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిపి ఇప్పటివరకు మొత్తం 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించింది. నాలుగో జాబితాలో 9మందిని ప్రకటించగా.. అందులో ఒకటి ఎంపీ స్థానం ఉంది. ఈ జాబితాలో ఎక్కువగా శింగనమల, తిరువూరు, మడకశిర, నందికొట్కూరు, గోపాలపురం, కొవ్వూరు, గంగాధర నెల్లూరు వంటి ఎస్సీ నియోజకవర్గ స్థానాలే ఉన్నాయి. వీటితో పాటు కనిగిరి స్థానానికి కూడా కొత్త ఇంచార్జ్‌ను వెల్లడించారు.

ఈ జాబితాను ఓసారి పరిశీలిస్తే చిత్తూరు ఎంపీగా ప్రస్తుతం ఉన్న రెడ్డప్పను గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగానూ, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్‌ ఇంఛార్జ్‌గానూ మార్చారు. గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కోవూరు నియోజకవర్గ ఇంచార్జ్‌గానూ, కోవూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి తానేటి వనితను గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్‌గానూ జంబ్లింగ్ చేశారు.

ఇక మిగిలిన స్థానాలైన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో వీరాంజనేయులు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానంలో దద్దాల నారాయణ యాదవ్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన కేశినేని నాని అనుచరుడు స్వామిదాస్‌, మడకశిరలో ఎం.తిప్పేస్వామి స్థానంలో ఈర లక్కప్ప, నందికొట్కూరులో ఆర్థర్‌కు బదులుగా డా.సుధీర్‌ దారాకు కొత్త ఇంచార్జ్‌లుగా చోటు కల్పించారు.

తొలి జాబితాలో 11 ఎమ్మెల్యే స్థానాలు, రెండో జాబితాలో 3 ఎంపీ, 24 ఎమ్మెల్యే, మూడో జాబితాలో 6 ఎంపీ, 15 ఎమ్మెల్యే, నాలుగో జాబితాలో ఓ ఎంపీ, 8 ఎమ్మెల్యేల అభ్యర్థులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జ్‌లను మార్చింది అధిష్టానం. ఇక త్వరలోనే మరో 12 ఎంపీ అభ్యర్థులు, 5 నుంచి 6 ఎమ్మెల్యే స్థానాలకు కొత్త ఇంఛార్జ్‌లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఇక ఎన్నికల ప్రచారంపైనే సీఎం జగన్ పూర్తి దృష్టి పెట్టనున్నారు.

 

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment
Related Videos