రాష్ట్రంలో వర్షాభావ పరిస్ధితులు .. ఆ రెండు పాదాల మహిమే : ఎంపీ అవినాష్ రెడ్డి సెటైర్లు

  • IndiaGlitz, [Thursday,August 31 2023]

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయి. ఆగస్ట్ పోయి సెప్టెంబర్ వస్తున్నా నేటికి సరైన వర్షాలు లేవు. ఎల్ నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో జూన్‌లో లోటు వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత పరిస్ధితులు చక్కబడి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు పోటెత్తాయి. కానీ ఆగస్ట్‌లో అస్సలు వర్షాలు పడలేదు. అయితే ఏపీలో వర్షాభావ పరిస్ధితులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లే కారణమంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. రెండు బలమైన పాదాల వల్లే రాష్ట్రంలో వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

వైఎస్ఆర్, జగన్‌ల హయాంలో మంచి వర్షాలు :

బుధవారం కడప జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లెలో ఎండిపోయిన వేరుశెనగ పంటను అవినాశ్ పరిశీలించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా అవసరానికి మించి వర్షాలు పడ్డాయని వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌ పాలనలో అవసరమైన మేర వర్షాలు కురిశాయని.. కానీ ఇప్పుడు మాత్రం కురవడం లేదనే చర్చ ప్రజల్లో జరుగుతోందని అవినాశ్ రెడ్డి చెప్పారు. అయితే రెండు బలమైన పాదాలు తమ మధ్యకు రావడం వల్లే వర్షాలు కురవడం లేదని జనం చెబుతున్నారని ఎంపీ పేర్కొన్నారు.

తండ్రీ కొడుకులిద్దరూ జిల్లాకు :

ఈ రెండింటిలో ఒకటి చంద్రబాబుదని.. రెండోది ఆయన కుమారుడు నారా లోకేష్‌దన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌లపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు.. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ కడప జిల్లాకు వచ్చారని అవినాష్ రెడ్డి గుర్తుచేశారు. వీరిద్దరూ మన మధ్యకు రావడం వల్లే తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయని.. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోందని రైతులు చెబుతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో వేల ఎకరాల్లో వేరుశెనగ పంట సాగు చేశారని.. 60 రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంట దెబ్బతిందని అవినాష్ రెడ్డి చెప్పారు. నష్టపోయిన పంటల వివరాలను ఈ క్రాప్ చేయించి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం వచ్చేలా కృషి చేస్తామని ఎంపీ రైతులకు హామీ ఇచ్చారు.

More News

CM YS Jagan:జగన్‌పై అభిమానం చాటుకున్న విద్యార్ధులు.. రాఖీ ఆకారంలో ముఖ్యమంత్రిపై మమకారం

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య బంధానికి, ప్రేమానురాగాలకు ప్రతిరూపంగా చెప్పుకునే రక్షాబంధన్ పర్వదినాన్ని భారతీయులు ఘనంగా జరుపుకుంటున్నారు.

Allu Arjun:అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చిన బన్నీ.. 'పుష్ప 2' లొకేషన్ పంచుకున్న ఐకాన్ స్టార్

జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Ntr100 Rupees:ఎన్టీఆర్ రూ.100 నాణెం కోసం ఫ్యాన్స్ క్యూ.. వేల కాయిన్స్ సేల్, మరిన్ని ముద్రించే పనిలో సర్కార్

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన సంస్మరణార్ధం రూ.100 నాణెం ముద్రించిన సంగతి తెలిసిందే.

Gas:దేశ ప్రజలకు ‘‘రక్షాబంధన్ ’’ కానుక.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, కేంద్రం ప్రకటన

పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రక్షా బంధన్ కానుక ఇచ్చింది. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్‌పై రూ.200 చొప్పున తగ్గించింది.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. జనసేన వినూత్నం, ఐదు సేవా కార్యక్రమాలకు పిలుపు

జనసేన అధినేత , సినీనటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజంటే అభిమానులకు పండుగ రోజు. పవన్ అన్న పేరే ప్రభంజనం,