YSRCP MP Candidates: వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. పలువురు సిట్టింగ్‌లకు షాక్..!

  • IndiaGlitz, [Tuesday,January 09 2024]

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కేటాయింపుపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చగా.. మరికొన్ని చోట్ల సిట్టింగ్‌లకు అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు ఎంపీ అభ్యర్థులను కూడా ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దించే అవకాశం కనిపిస్తుండగా.. కొంతమంది సిట్టింగ్‌లకు మాత్రం నిరాశ ఎదురుకానుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థులు వీరేనంటూ ప్రచారం జరుగుతోంది.

ఓసారి ఈ జాబితాను పరిశీలిస్తే..

శ్రీకాకుళం ఎంపీగా 2019లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ప్రస్తుతం ఈ సీటులో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, దానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి, పిరియా విజయ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి బెల్లాన చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే మజ్జి శ్రీనివాసరావు, మంత్రి బొత్స సత్యానారాయణ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.

విశాఖపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఎంవీవీ సత్యనారాయణ ఉన్నాయి. ఈసారి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.

అరకు పార్లమెంట్ స్థానం నుంచి గొడ్డేటి మాధవి సిట్టింగ్ ఎంపీగా ఉండగా ఈసారి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేరు ఖరారు అయింది.

అనకాపల్లి ఎంపీగా బీవీ సత్యవతి ఉండగా.. ఈసారి కరణం ధర్మశ్రీని పోటీ చేయించే అవకాశం ఉంది.

కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత స్థానంలో చలమలశెట్టి సునీల్ పేరు పరిశీలనలో ఉంది.

అమలాపురం నుంచి చింతా అనురాధ సిట్టింగ్ ఎంపీగా ఉండగా.. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా పేరును పరిశీలిస్తున్నారు.

రాజమండ్రి లోక్‌సభ నుంచి సిట్టింగ్ ఎంపీగా మార్గాని భరత్ ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన అనుసూరి పద్మలత పేరు పరిశీలిస్తున్నారు.

నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణంరాజు ఉన్నారు. ఆయన పార్టీకి దూరంగా ఉండడంతో గోకరాజు గంగరాజు, ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.

ఏలూరు నుంచి సిట్టింగ్ ఎంపీగా కోటగిరి శ్రీధర్ ఉన్నారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి ఆళ్ల నాని, మంత్రి కొట్టు సత్యనారాయణ, అరసవిల్లి అరవింద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ వల్లభనేని బాలశౌరి స్థానంలో డైరెక్టర్ వీవీ వినాయక్ పేరు పరిశీలనలో ఉంది.

విజయవాడ ఎంపీగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేరు పరిశీలనలో ఉంది.

గుంటూరు ఎంపీగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పేరు పరిశీలిస్తున్నారు.

నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయులు ఉండగా.. ఆయన స్థానంలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉంది.

బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ నందిగం సురేశ్‌ను కొనసాగే ఛాన్స్ ఉంది.

ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.

నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్థానంలో సినీ నటుడు అలీ, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్లను పరిశీలిస్తున్నారు.

కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి సంజీవ్‌కుమార్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన స్థానంలో మంత్రి గుమ్మనూరు జయరాం పేరు పరిశీలనలో ఉంది.

అనంతపురం ఎంపీ తలారి రంగయ్య స్థానంలో మాజీ మంత్రి, పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ పేరు ఖరారు అయింది.

హిందూపురం ఎంపీ అభ్యర్థిగా జె.శాంతమ్మ పేరు ఇప్పటికే ఖరారు చేశారు.

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్‌రెడ్డి కొనసాగుతారు.

నెల్లూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉంది.

తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని కొనసాగించే ఛాన్స్ ఉంది..

రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డి, చిత్తూరు ఎంపీగా ఎస్.రెడ్డప్పలను కొనసాగించే అవకాశం ఉంది.

మొత్తానికి వైసీపీ నుంచి ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఇవేనంటూ పైన పేర్కొన్న జాబితా అయితే వైరల్ అవుతోంది. మరి ఈ జాబితా ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

More News

AP Politics: పార్టీలు మారిన నేతలపై పోటాపోటీ ఫిర్యాదులు.. రసవత్తరంగా ఏపీ రాజకీయాలు..

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు రంజుగా మారుతోంది. ఎప్పుడూ ఏ పార్టీ నుంచి ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఊహించడం కష్టమవుతోంది. మరో రెండు నెలల్లో జరగనున్న

Vijayasai Reddy: ఏపీ, తెలంగాణ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: విజయసాయి రెడ్డి

ఏపీతో పాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల బృందాన్ని అభ్యర్థించారు. విజయవాడలో సీఈసీ బృందం

YS Jagan: నాడు వైయస్సార్.. నేడు వైయస్ జగన్.. సేమ్ సిట్యుయేషన్..

సింహాన్ని ఎదుర్కోవడానికి గుంటనక్కలన్ని ఒక్కటవుతున్నాయి. కానీ ఆ గుంటనక్కలకు తెలియదు ఏమిటంటే సింహాం గర్జన ముందు తట్టుకుని నిలబడలేవని..

Dil Raju: తనపై తప్పుడు వార్తలు రాసిన సినీ జర్నలిస్టుకు దిల్ రాజు వార్నింగ్.. వీడియో వైరల్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తనపై తప్పుడు వార్తలు రాసిన వారి తాటతీస్తా...

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన పచ్చడి.. బండ్ల గణేశ్‌ డ్రైవర్ అరెస్ట్..

ప్రస్తుత సమాజంలో యువత ఓపికగా ఉండటానికి ఇష్టపడటం లేదు. దీంతో క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు