ఆర్టీసీ బస్లో కోట్లు తరలిస్తూ అడ్డంగా దొరికిన వైసీపీ నేత
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటంతో నేతలు ఓటర్లను ప్రలోభాలు పెడుతున్నారు. ఎక్కడ చూసినా నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే అటు పోలీసు అధికారులు.. ఇటు ఎన్నికల స్పెషల్ టీమ్ కొన్ని కొట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మరో మూడ్రోజులు మాత్రమే ఎన్నికలకు ఉండటంతో ఈ టైమ్లోనే ఎక్కువగా డబ్బులు తరలిస్తారని పసిగట్టిన అధికారులు ఎక్కడికక్కడ వాహనాలను చెకింగ్ చేస్తున్నారు.
తాజాగా.. రాజాం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత పాలవలస విక్రాంత్ 10 కోట్లతో రెడ్ హ్యాండెడ్గా చిక్కిపోయారు. ఆర్టీసీ బస్సులో ఈ భారీ నగదు తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు చెక్ చేయగా బ్యాగ్లు తెరిచి చూడగా అన్నీ నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. దీంతో ఆ నగదు మొత్తాన్ని విక్రాంత్ను స్థానికంగా పోలీసు స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. కాగా ఈ మొత్తం నగదు ఆర్టీసీ బస్సు నంబర్: 8036 లో దొరికింది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout