YS Sharmila:కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వైఎస్ షర్మిల

  • IndiaGlitz, [Saturday,April 20 2024]

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నాన్న సమాధి దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు అని.. ప్రస్తుత రాజకీయాలన్నింటినీ అర్థం చేసుకోగలరని చెప్పారు. వైఎస్ఆర్, వివేకాను ఇంకా మరిచిపోలేదని.. తన గెలుపుపై సంపూర్ణ నమ్మకం ఉందని పేర్కొ్న్నారు. అది నిరూపించుకునే సమయం ఆసన్నం అయ్యిందని పేర్కొన్నారు. ధర్మం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో భారీ మెజారిటీ‎తో గెలుస్తానని దృఢమైన నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.

అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి నివాళుర్పించారు. నివాళులు అనంతరం కడప ITI సర్కిల్ నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని కలెక్టర్ కార్యాలయంకు చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ధర్మం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలు ఆశీర్వదించి మీ ఆడబిడ్డకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

నామినేషన్‌కు బయలుదేరే ముందు ‘‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారిని, వైఎస్ వివేకానంద‌రెడ్డి గారిని మరిచిపోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’’ అని ట్వీట్ చేశారు.

కాగా ఈసారి కడప ఎంపీ ఎన్నిక రాష్ట్రమంతా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ కుటుంబసభ్యులు ప్రత్యర్థులు తలపడుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షర్మిల బరిలో దిగారు. ముఖ్యంగా వివేకా హత్య కేసు ఈ ఎన్నికలో కీలకంగా మారనుంది. వివేకా హత్య కేసుల అవినాష్ రెడ్డి నిందుతుడని.. ఆయనను సీఎం జగన్ కాపాడుతున్నారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. దీంతో వైఎస్ కుటుంబానికి కంచుకోటగా మారిన కడప గడ్డ మీద ఈసారి ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

More News

Alekhya Reddy: రాజకీయాల్లో బాలయ్యకు తారకరత్న భార్య అలేఖ్య మద్దతు

నందమూరి తారకరత్న చనిపోయి ఏడాది దాటినా భార్య అలేఖ్య మాత్రం నిత్యం ఆయనను తలుచుకుంటూ ఎమోషన్ అవుతూ ఉంటారు. తారకరత్న అకాలమరణం తర్వాత ఆయన కుటుంబ బాధ్యతను

Duvvada Srinivas:తనపై భార్య పోటీకి దిగడంపై స్పందించిన దువ్వాడ శ్రీనివాస్

ఏపీలో పోలింగ్ దగ్గర పడుతున్న వేళ రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.

TDP:శవ రాజకీయాలకు తెరలేపిన తెలుగుదేశం పార్టీ

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంటే..

Pemmasani:అమరావతికి ఇంత ద్రోహం చేసిన జగన్‌కు బుద్ధి చెప్పాలి: పెమ్మసాని

ప్రజాధనాన్ని దోచుకుంటున్న నాయకులు, అధికారులను ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని

CM Jagan and Sharmila:తల్లి విజయమ్మకు సీఎం జగన్, షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు

ఏపీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సింపుల్‌గా హ్యాపీ బర్త్‌డే అమ్మ అంటూ ట్వీట్ చేశారు.