వైసీపీ మూడో జాబితాలో బడుగు, బలహీన వర్గాలకు అగ్రతాంబూలం

  • IndiaGlitz, [Friday,January 12 2024]

సామాజిక న్యాయమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్.. అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలతో ఎంతో మేలు చేస్తున్నారు. అలాగే పదవుల్లో కూడా వారికే పెద్ద పీట వేస్తున్నారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ మాటల్లో చెప్పడం కాదు.. చేతల్లో చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల కసరత్తు చేస్తున్న పార్టీ అధినేత జగన్.. తాజాగా 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది.

11 అసెంబ్లీ స్థానాలు కేటాయింపు..

ఈ జాబితాను పరిశీలిస్తే సామాజిక న్యాయం స్పష్టంగా కనిపిస్తోంది. 15 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలను బీసీలు, ఎస్సీ, మెనార్టీలకు కేటాయించింది. మిగిలిన నాలుగు స్థానాల్లో ఓసీలకు చోటు ఇచ్చింది. ముందుగా చెబుతున్నట్లు బడుగు, బలహీన వర్గాలకు అగ్రతాంబూలం ఇచ్చింది. పెనమలూరు నుంచి మంత్రి జోగి రమేశ్, పెడన నుంచి ఉప్పాల రాము, ఆలూరు నుంచి విరూపాక్షి, ఇచ్ఛాపురం నుంచి పిరియా విజయ, టెక్కలి నుంచి దువ్వాడ శ్రీనివాస్.. బీసీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. ఇక పూతలపట్టు నుంచి సునీల్‌కుమార్, చింతలపూడి నుంచి విజయరాజు, కోడుమూరు నుంచి డాక్టర్. సతీశ్, సత్యవేడు నుంచి గురుమూర్తి, గూడూరు నుంచి మేరిగ మురళి.. ఎస్సీ అభ్యర్థులుగా ఉన్నారు. మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్.. మైనార్టీ అభ్యర్థిగా స్థానం దక్కించుకున్నారు.

బీసీలకు 4 ఎంపీ స్థానాలు..

ఇక 6 ఎంపీ స్థానాల్లో 4 స్థానాలనూ బీసీలకు ఇవ్వడం జరిగింది. మిగిలిన రెండు స్థానాల్లో ఓసీ, ఎస్సీలకు కేటాయించారు. వీరిలో శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పేడాడ తిలక్, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, ఏలూరు ఎంపీ స్థానానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవ్, కర్నూలు ఎంపీ స్థానానికి మంత్రి గుమ్మనూరి జయరాం.. బీసీ అభ్యర్థులుగా ఉన్నారు. ఓసీ అభ్యర్థిగా కమ్మ సామాజికవర్గానికి చెందిన కేశినేని నానికి విజయవాడ ఎంపీ స్థానానికి ఎంపిక చేశారు. తిరుపతి ఎంపీ స్థానం నుంచి ఎస్సీ వర్గానికి చెందిన కోనేటి ఆదిమూలంకు అవకాశం కల్పించారు. మొత్తంగా చూసుకుంటే 21 మందితో కూడిన మూడో జాబితాలో సామాజిక న్యాయం పాటించారు.

More News

పందెంకోడి వేలంలో సూపర్ ట్విస్ట్.. వేలం ఆపాలని ఓ వ్యక్తి విజ్ఞప్తి..

ఆర్టీసీ అధికారులు పందెంకోడిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఓ వ్యక్తి ఆ కోడి తనదే వేలం ఆపాలని కోరాడు. అసలు ఇదంతా ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

Kalki 2898 AD Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూపర్బ్ న్యూస్.. 'కల్కి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

'సలార్' హిట్‌తో మంచి జోరు మీదున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న

Mahesh Babu: అభిమానులతో కలిసి 'గుంటూరు కారం' మూవీ చూసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. బాబు యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్‌లు ఇరగదీశాడంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Akshay Kumar: మెట్రో రైలులో ప్రయాణించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్

దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)లో ట్రాఫిక్ కష్టాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జెంట్ పని మీద సొంత వాహనాలు లేదా ప్రైవేట్ వాహనాల్లో రోడ్డు మీద వెళ్లాల్సి వస్తే గంటల మేర ట్రాఫిక్‌లో

పల్లెబాట పట్టిన నగరవాసులు.. రద్దీగా హైదరాబాద్-విజయవాడ హైవే..

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ 'సంక్రాంతి'. సంక్రాంతి వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే పల్లెలు, పట్టణాలు పండుగకు సిద్ధమవుతూ ఉంటాయి.