జగన్ కేసుల విచారణ సోమవారానికి వాయిదా

ఏపీ ముఖ్యమంతి జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసు విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు అంగీకరించింది. కాగా.. జగన్‌కు సంబంధించిన కేసుల విచారణ ప్రతి శుక్రవారం జరిగేది. కానీ ఇటీవల ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను సత్వరమే విచారించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో హైకోర్టు ఈ కేసుల విచారణను రోజువారీ చేపట్టాలని ఆదేశించింది. దీంతో కేసు విచారణను సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

కాగా.. కరోనా కారణంగా న్యాయవాదులు, నిందితులు అంతా కోర్టు హాలులో ఉండటం ఇబ్బందిగా మారుతుందని.. కాబట్టి విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని జగన్ తరుఫు న్యాయవాదులు కోరారు. తాము విచారణకు సహకరిస్తామని.. కాబట్టి స్పష్టమైన ఉత్తర్వులివ్వాలని కోరారు. జగన్ కేసులో హైకోర్టులో స్టే ఉన్న కేసులను నవంబర్ 9కి వాయిదా వేస్తున్నట్టు సీబీఐ కోర్టు తెలిపింది. కాగా.. జగన్‌కు సంబంధించిన అన్ని కేసులపై విచారణను మాత్రం సోమవారానికి వాయిదా వేసింది.

More News

ప్రభాస్‌ 21లో బిగ్‌ బి

ప్యాన్‌ ఇండియా స్టార్‌ పభాస్‌ 21వ సినిమా రేంజ్‌ పెరుగుతూ వస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మాతగా 'మహానటి' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.

టీఆర్పీ స్కాంలో రిపబ్లిక్ టీవీ

ముంబైలో టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్ల(టీఆర్‌పీ) స్కాంను పోలీసులు బట్టబయలు చేశారు. టీవీ రేటింగ్‌లను నిర్ణయించే బార్క్‌ (బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌) తరఫున మీటర్ల మానిటరింగ్‌

కెప్టెన్‌గా సొహైల్.. మోనాల్‌ విషయంలో స్ట్రాంగ్‌గా అఖిల్ ఫిక్స్

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ డిజైన్ చేసిన వారి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అలా వెరైటీగా డిజైన్ చేశారు. ఇక కెప్టెన్సీని సొహైల్ దక్కించుకున్నాడు.

జ‌న‌వ‌రిలో ప్లాన్ చేస్తున్న ప‌వ‌న్‌..!

ఇంత‌కూ జ‌న‌వ‌రిలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం ప్లాన్ చేస్తున్నారు? అనే సందేహం క‌లుగ‌క‌మాన‌దు.

మురళీధరన్ బయోపిక్‌లో విజ‌య్ సేతుప‌తి

ఇండియ‌న్ సినిమాలో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తోంది.