యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'తొండి'

  • IndiaGlitz, [Tuesday,September 08 2015]

సందీప్, ప్రియ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం తొండి. ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రసాద్ వెల్లంపల్లి దర్శకత్వంలో కె.కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు తదితరలు ముఖ్య తారాగణం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి.

ఈ సందర్భంగా..

ప్రసాద్ వెల్లంపల్లి మాట్లాడుతూ 'మనసులో ఒకటి అనుకుని బయట మరోటి చేయడాన్ని తొండి అంటుంటాం. ఆటల్లోనే ఈ తొండి వ్యవహారాలు జరుగుతుంటాయి. అయితే కొందరు నిజ జీవితంలో, ప్రేమ వ్యవహారాల్లో కూడా తొండిగా వ్యవహరిస్తుంటారు. ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా కథను రాసుకున్నాం'' అన్నారు.

నిర్మాత కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ 'ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. డంక్రన్ డ్రైవ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా రాజేంద్రప్రసాద్ పాత్ర కీలకం. ఐపిఎల్ కు పోటీగా బ్రహ్మానందం ఆడే బిపిఎల్ ఎపిసోడ్ సినిమాలో అదిరిపోతుంది. సంపూ కామెడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వుకుంటారు. మలేషియా, హైదరాబాద్, వైజాగ్ లోకేషన్స్ లో సినిమాని చత్రీకరించాం. వచ్చేవారం సినిమాని,త్వరలోనే సినిమా విడుదల చేస్తాం'' అన్నారు.