‘యాత్ర’ డైరెక్టర్ కొత్త సినిమా.. నిర్మాతగా పీవీపీ

  • IndiaGlitz, [Friday,August 02 2019]

‘ఆనందో బ్రహ్మ’ సినిమా కామెడీ పండించి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ ఎమోషనల్‌గా టచ్ చేసిన మహి వి. రాఘవ్.. ఈ సారి ఏకంగా ‘సిండికేట్’ సినిమాతో వచ్చేస్తున్నారు. కాగా.. ‘యాత్ర’ సినిమా సూపర్ డూపర్ హిట్టయిన తర్వాత సీక్వెల్‌గా ‘యాత్ర-2’ తెరకెక్కిస్తారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సీక్వెల్ కాదని.. ‘సిండికేట్’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

మహి ట్వీట్ సారాంశం ఇదీ..

‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ చిత్రాల తర్వాత ఎలాంటి కథను చెప్పాలనుకునే నిర్ణయం కఠినమైనదే. ఓ దర్శకుడికి కథను చెప్పడం కంటే, ఎలాంటి కథను చెప్పాలి అనేదే ముఖ్యం. నిశ్శబ్దంలో ఉన్నప్పుడు దర్శకుడి మదిలో మెదిలే ఆలోచనే స్టోరీ. నా తదుపరి చిత్రం యాక్షన్ డ్రామా, టైటిల్ ‘సిండికేట్’ అని రాఘవ తన ట్విట్టర్‌లో ప్రకటించారు. కాగా ఈ ట్వీట్‌కు పీవీపీ రియాక్ట్ అవుతూ.. ‘మహి వి.రాఘవ్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాను’ అని ప్రకటించేశారు.

సో.. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉంటుందో..? సిండికేట్‌కు నటీనటులెవరో..? ఎవర్ని హీరోగా ఎంచుకుంటారో..? అనేది మాత్రం ఇంత వరకూ తెలియరాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్శకుడు, నిర్మాత వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More News

'మిస్టర్‌ కిల్లర్‌' టీజర్‌ను విడుదల చేసిన అల్లరి నరేష్‌

రమేష్‌ స్టూడియోస్‌, శ్రీనిక్షిత ప్రొడక్షన్స్‌ పతాకాలపై చార్లెస్‌ దర్శకత్వంలో రమేష్‌బాబు ధూళిపాళ, శ్రీకృష్ణ శ్రవణ్‌ తుమ్మలపల్లి నిర్మిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మిస్టర్‌ కిల్లర్‌'. విశ్వ

ఉగ్రవాదంపై ఉక్కుపాదమే.. కీలక బిల్లుకు పెద్దలు ఆమోదం

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో భాగంగా దాయాదీ దేశాలను గజగజ వణికిస్తున్నప్పటికీ ఉగ్రమూకలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు.

మెగాస్టార్ చిరు గురువు దేవదాస్ ఇకలేరు

టాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. కాగా ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.

అలీ విలన్‌.. తమన్నా హీరోయిన్‌.. రచ్చ రచ్చేగా!

టైటిల్ చూసి ఇదేంటి అలీని తమన్నా చీకొట్టడమేంటని అనుకుంటున్నారా..? అదేనండి ఇదంతా మీరు అనుకుంటున్నట్లుగా కమెడియన్ అలీ.. హీరోయిన్ తమన్నా గురించి కాదండోయ్..

రెండుచోట్ల ఓటమికి కారణం కనుగొనే పరిష్కారం దిశగా పవన్!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓటమిపాలైన విషయం విదితమే. పార్టీ అధ్యక్షుడే ఓడిపోయారంటే ఆషామాషీ విషయమేం కాదు.. అంతేకాదు రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ ఒక్క చోట