చీకటి రాజ్యంలో నటించిన రైటర్స్...?

  • IndiaGlitz, [Wednesday,September 30 2015]

కమల్ హాసన్ హీరోగా రాజేష్.ఎం సెల్వ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చీకటిరాజ్యం. విభిన్నంగా ఒకేరోజు జ‌రిగే క‌థ‌తో ఈ సినిమా రూపొందుతుంది.రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ సోదరుడు చంద్రహసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మన్మథబాణం చిత్రంలో కమల్ తో కలసి నటించిన త్రిష..మ‌ళ్లీ ఇప్పుడు క‌మ‌ల్ తో న‌టిస్తుంది.

ఈ చిత్రాన్ని దీపావళి రోజున విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో క‌మ‌ల్ తో పాటు ఇద్ద‌రు తెలుగు ర‌చ‌యిత‌లు న‌టిస్తున్నారు. ఇంత‌కీ ఆ ఇద్ద‌రు ర‌చ‌యిత‌లు ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఒక‌రు గీత ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి, మ‌రోక‌రు మాట‌ల ర‌చ‌యిత అబ్బూరి ర‌వి. వీరిద్ద‌రు క‌మ‌ల్ తో క‌ల‌సి ఓ స‌న్నివేశంలో న‌టించార‌ట‌.ఇదే విష‌యం గురించి అడిగితే.. క‌మ‌ల్ సినిమాకి ప‌ని చేసే అవ‌కాశం ఎప్పుడో కాని రాదు. ఇప్పుడు వ‌చ్చింది. మ‌ళ్లీ ఎప్పుడో వ‌స్తుందో తెలియ‌దు. అందుక‌నే క‌మ‌ల్ తో క‌ల‌సి ప‌నిచేసామ‌ని గ‌ర్వంగా చెప్పుకోవ‌డం కోసం మేమే కావాల‌ని అడిగి చీక‌టి రాజ్యంలో న‌టించాం అంటున్నారు రైట‌ర్స్ అబ్బూరి, జోగ‌య్య‌.

More News

విలక్షణ పాత్రలో నయనతార

పెర్ ఫారెన్స్ రోల్స్ తో పాటు, గ్లామర్ రోల్స్ లో కూడా అలరిస్తున్న నయనతార రీసెంట్ గా ‘మయూరి’ చిత్రంలో మంచి సక్సెస్ ను అందుకుంది.

నానికి ఇద్దరు

‘అష్టాచమ్మా’..సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. క్లాస్ కామెడితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా నాని హీరోగా పరిచయమైయ్యాడు.

ఆ హీరో తో టెన్ష‌న్ అంటున్న రాశి ఖ‌న్నా

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై..అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ రాశి ఖ‌న్నా.

విజయ్ , నయన్ , సమంత ఇళ్లపై దాడి..

తమిళ హీరో విజయ్,హీరోయిన్స్ నయనతార,సమంత ఇళ్ల పై దాడి చేసింది ఎవరో కాదు ఇన్ కమ్ టాక్స్ అధికారులు.ఈ రోజు ఉదయం నుంచి ఈ దాడులు ప్రారంభమయ్యాయి.

లోఫ‌ర్ కొత్త టైటిల్ ఏమిటి..?

నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు.