విలన్‌ గా మారిన‌ రచయిత

  • IndiaGlitz, [Wednesday,May 02 2018]

అబ్బూరి రవి.. తెలుగు సినీ ప్రియులకు పరిచయం అక్కరలేని పేరు. మాటల రచయితగా 'ఎలా చెప్పను'తో టాలీవుడ్‌కు పరిచయమైన ర‌వి.. పాతిక సినిమాలకు పైగా మాటలను అందించారు. అందులో 'బొమ్మరిల్లు', 'కిక్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్', 'ఎవడు', 'క్షణం', 'ఊపిరి', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి విజయవంతమైన చిత్రాలు కూడా ఉన్నాయి.ఇప్పుడు ఈ మాటల రచయిత విలన్‌గా అవతారం ఎత్తనున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే.. సాయి కిరణ్ అడివి డైరెక్షన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అందులో విలన్ పాత్ర కోసం అబ్బూరి రవిని సంప్రదించారట దర్శకుడు. ముందు ససేమిరా అన్నా.. సాయి కిరణ్ మాత్రం ఎలాగోలా కన్విన్స్ చేసి ఒప్పించారని సమాచారం.

విలన్ పాత్ర కోసం బాలీవుడ్ వైపు చూస్తున్న ఈ తరుణంలో.. ఒక తెలుగు రచయితను విలన్‌గా నటింపచేయడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే.. మాటల రచయితగా విజయం సాధించిన రవి.. ఇప్పుడు నటుడిగా ఏ మేర ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

More News

మనాలీ కి కొలీవుడ్ ఆఫర్

స్వాతి, శ్రీ దివ్య, ఆనంది.‌.  వీరందరు తెలుగు హీరొయిన్ లు. తమిళంలో సక్సెస్పుల్  కధానాయికలుగా వెలుగొందినవారు.

రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న 'సాహో'

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న మూవీ ‘సాహో’.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న భారీ గ్రాఫిక్‌ చిత్రం 'భద్రకాళి'

ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో సీనియర్‌ నటి సీత టైటిల్‌ పాత్రలో యువ నిర్మాత చిక్కవరపు రాంబాబు అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో  రూపొందిస్తున్న చిత్రం 'భద్రకాళి'.

సమ్మోహనం​ టీజర్ చూస్తుంటే స్ట్రాంగ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది - మెగాస్టార్ చిరంజీవి

"సమ్మోహనం" సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి. సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా