అప్పుడు ర‌చ‌యిత‌..ఇప్పుడు డైరెక్ట‌ర్‌...

  • IndiaGlitz, [Wednesday,December 13 2017]

వెంక‌టేష్ సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేని సినిమా 'నువ్వు నాకు న‌చ్చావ్'. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కె.విజ‌య్‌భాస్క‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ మాట‌లు అందించాడు.

ఈ సంభాష‌ణ‌లు, వెంకీ న‌ట‌న మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత నుండి ద‌ర్శ‌కుడిగా మారాడు. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ న‌టిస్తుండ‌టం కొస‌మెరుపు.

ఈ విష‌యాన్ని నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ వెంక‌టేష్ పుట్టిన‌రోజు(డిసెంబ‌ర్ 13) సంద‌ర్భంగా తెలియ‌జేశారు. త్వ‌ర‌లోనే సినిమా ప్రారంభం అవుతుంద‌ని కూడా తెలియ‌జేశారు.

More News

మ‌హేష్ సినిమా సినిమాటోగ్రాఫ‌ర్ మారుతున్నాడా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'భ‌ర‌త్ అను నేను'( విన‌ప‌డుతున్న పేరు). కైరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 27న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

విశాల్ సినిమా వాయిదా?

మాస్‌ హీరో విశాల్‌ ఇటీవల విడుదలైన 'డిటెక్టివ్‌'తో మరో సూపర్‌హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'అభిమన్యుడు'.

సినిమాల్లోకి హీరోయిన్ కుమారుడు

చిరంజీవి, బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు ఇటా స్టార్స్‌తో న‌టించిన హీరోయిన్ సుమ‌ల‌త అందరికీ గుర్తుండే ఉంటుంది. క‌న్న‌డ న‌టుడు అంబ‌రీష్‌ను వివాహం చేసుకుని సెటిలైంది.

'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' సక్సెస్‌ టూర్‌

సప్తగిరి హీరోగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రతం సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది.

రెగ్యులర్‌ షూటింగ్‌లో సాయిధరమ్‌తేజ్‌ చిత్రం

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.