Telangana Women MLAs:తెలంగాణ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మహిళా అభ్యర్థులు వీరే..

  • IndiaGlitz, [Monday,December 04 2023]

తెలంగాణ అసెంబ్లీలో ఈసారి మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో పది మంది మహిళలు గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు మహిళలు గెలుపొందారు. గత అసెంబ్లీలో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా ఈసారి అదనంగా నలుగురు మహిళలు ఎన్నికయ్యారు. దీంతో మొత్తం పది మంది మహిళలు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులుగా ములుగు నుంచి సీతక్క, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, కోదాడ నుంచి పద్మావతి రెడ్డి, నారాయపేట నుంచి చిట్టెం పర్ణికా రెడ్డి, పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ తరపున మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మీ, నర్సాపూర్ నుంచి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గెలుపొందారు.

ఇక పాలకుర్తి నుంచి సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై యశస్విని రెడ్డి గెలిచి చరిత్ర సృష్టించారు. ఆమె వయసు కేవలం 26 సంవత్సరాలు కావడం విశేషం. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పలు మార్లు మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లిని ఓడించడంతో యశస్విని పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. ఇక ములుగు నుంచి సీతక్క హ్యాట్రిక్ కొట్టగా.. మహేశ్వరం నుంచి రెండో సారి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించి పట్టు నిలుపుకున్నారు. మొత్తానికి ఈసారి అసెంబ్లీలో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగడం శుభపరిణామని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More News

CM, Deputy CM:తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపిక దాదాపు ఖరారైంది. ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Janasena: హైదరాబాద్‌లో మూసీ నది పాలైన జనసేన, టీడీపీ పరువు

అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడు అన్న చందంగా సొంత రాష్ట్రంలోనే దిక్కు లేదు కానీ వేరే రాష్ట్రంలో పోటీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Typhoon effect:తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు..

మించౌగ్ తుపాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయ గోదావరి,

Two MLAs:బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 64 సీట్లతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కన్నా నాలుగు స్థానాలు ఎక్కువ గెలుచుకుంది.

Bigg Boss Telugu 7 : ప్రశాంత్ సేఫ్ గేమ్ , బిగ్‌బాస్ నుంచి గౌతమ్ ఎలిమినేట్ .. అర్జున్ బతికిపోయాడన్న నాగార్జున

బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది.