ద‌క్షిణాది హీరోయిన్ క‌థ‌తో...

  • IndiaGlitz, [Tuesday,November 21 2017]

రాయ్ ల‌క్ష్మీ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'జూలీ 2'. సినిమా విడుద‌ల‌కు ముందు ఈ సినిమా చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. ఈ సినిమాను దీపిక్ శివ్‌స‌దాని తెర‌కెక్కించడంతో పాటు స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. దీప‌క్‌నాయ‌ర్‌, ప‌హ‌ల‌జ్ నిహ్‌లానీ నిర్మాత‌లు. . అయితే నేహాధూపియాతో 'జూలీ' సినిమాను తెర‌కెక్కించిన నిర్మాత పాచిసియా 'జూలీ 2' పై కేసు వేశాడు.

అయితే కేసు ప‌రిశీలించిన బాంబే హై కోర్టు కేసు కొట్టేయ‌డంతో సినిమా ఈ న‌వంబ‌ర్ 24న విడుదల కానుంది. ఇదొక ద‌క్షిణాది హీరోయిన్ క‌థ‌. 90 ద‌శ‌కంలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈమె, ఉత్త‌రాదిన కూడా న‌టించింది. బోజ్‌పురి సినిమాల్లో కూడా న‌టించిందంటూ చిత్ర ద‌ర్శ‌క నిర్మాత దీప‌క్ శివ్ స‌దాని తెలియ‌జేశారు. రాయ్‌ల‌క్ష్మీ న‌టించిన 'జూలీ2' ఆమెకు తొలి బాలీవుడ్ చిత్రం. ఇందులో రాయ్ త‌న అందాల‌తో ఘాటు పుట్టించ‌నుంది.

More News

లక్కీ హీరోయిన్ తో రామ్

చాలా గ్యాప్ తర్వాత రామ్కు సక్సెస్ను అందించిన చిత్రం `నేను శైలజ`. ఈ సినిమాలో రామ్ సరసన శైలజగా నటించి మెప్పించింది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ అమ్మడు ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారింది.

30 కోట్ల గరుడవేగ

జ్యో స్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్పై డా.రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 3న విడుదలైంది.

నారా రోహిత్ గెస్ట్ రోల్....

విభిన్నమైన కథలను ఎంచుకుని సినిమాలు చేసే యువ హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ప్రస్తుతం నారా రోహిత్ తన స్వీయ నిర్మాణం సంస్థలో `నీది నాది ఒకే కథ` అనే సినిమాను నిర్మిస్తున్నాడట.

'పద్మావతి'కి రెండు రాష్ట్రాల్లో చుక్కెదురు...

ఈ మధ్య కాలంలో ఎక్కువ వివాదాల్లో కూరుకున్న చిత్రం `పద్మావతి`. రాజస్థాన్ మహారాణి పద్మావతి జీవితగాథను సంజయల్ లీలా బన్సాలీ అదే పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో దీపికా పదుకొనే నటిస్తుంటే..చిత్తోర్గఢ్ రాజు రతన్సింగ్పాత్రలో షాహిద్ కపూర్, అల్లా ఉద్దీన్ఖిల్జీ పాత్రలో రణ్ వీర్సింగ్ నటిస్తున్నారు.

నేను డబుల్ మెచ్యూరిటీతో చేస్తున్న సినిమా ఇది - నాగార్జున

"శివ, అంతం, గోవింద గోవింద" వంటి సెన్సేషనల్ హిట్స్ అనంతరం రాంగోపాల్ వర్మ-అక్కినేని నాగార్జునల క్రేజీ కాంబినేషన్ లో దాదాపు 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రూపొందుతున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు (నవంబర్ 20) అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత ఘనంగా రాంగోపాల్ వర్మ శిష్యగణం, నాగార్జున మిత్ర బృందం సమక్షంలో జరిగింది.