రామ్‌తో తొమ్మిదేళ్ళ త‌రువాత‌..

  • IndiaGlitz, [Tuesday,May 01 2018]

యువ క‌థానాయ‌కుడు రామ్ ప్ర‌స్తుతం హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త్రినాథరావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుద‌ల‌య్యేలోపే దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మ‌రో సినిమా ప‌ట్టాలెక్కించ‌నున్నారు రామ్‌. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభ‌మ‌య్యింది.

ఈ నెల 7 నుంచి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.  యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్స్‌కు స్కోప్ ఉన్న ఈ సినిమా కోసం - 20 సెల్సియ‌స్ డిగ్రీల‌లో షూటింగ్ చేయ‌బోతున్నార‌ని చిత్ర బృందం ఇప్ప‌టికే పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి యువ సంగీత ద‌ర్శ‌కుడు మిక్కీ జె.మేయ‌ర్ సంగీత‌మందించ‌నున్నారు. గ‌తంలో రామ్‌, మిక్కీ కాంబినేష‌న్‌లో గ‌ణేష్ చిత్రం వ‌చ్చింది. మ‌ళ్ళీ తొమ్మిదేళ్ళ త‌రువాత వ‌స్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం. 

More News

దేవిశ్రీ విష‌యంలో ఈసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

యంగ్ హీరో రామ్‌కు క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుల‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు.

మ‌హేశ్ 25వ చిత్రం అప్‌డేట్‌

తాజాగా భ‌ర‌త్ అనే నేను సినిమా రూపంలో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

డ‌ల్లాస్ లో మూవీ ఆర్టిస్ట్సు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు

డ‌ల్లాస్ లో తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ అండ్ ఫిలింస్టార్స్ ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వ‌హించిన మూవీ ఆర్టిస్ట్సు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు బ్ర‌హ్మాండంగా, అంగ‌రంగ వైభంగా జ‌రిగాయి.

కాజ‌ల్‌కు రెండో సారి క‌లిసొస్తుందా?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు గ‌త ఏడాది మంచి విజ‌యాలే ద‌క్కాయి. ముఖ్యంగా.. మెగాస్టార్ చిరంజీవితో తొలిసారిగా క‌లిసి న‌టించిన ఖైదీ నెం.150 ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్

ప్ర‌భాస్‌తో మ‌రోసారి కొర‌టాల శివ‌

మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను.. ఇలా వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు సొంతం చేసుకుని సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అయిపోయారు కొరటాల శివ‌.