YS Jagan: దుర్గమ్మ దీవెనలతో మహిళలు అన్ని రంగాల్లో శక్తివంతంగా ఎదగాలి: సీఎం జగన్

  • IndiaGlitz, [Tuesday,October 24 2023]

స్త్రీ లేనిదే జననం లేదు. స్త్రీ లేనిదే గమనం లేదు. స్త్రీ లేనిదే సృష్టే లేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా పలు బాధ్యతలు మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అలాంటి మహిళలకు సీఎం జగన్ అన్నలా, తమ్ముడిలా భరోసా కల్పిస్తున్నారు. జగనన్న పాలనలో మహిళలు మహారాణులుగా వెలిగొందుతున్నారు. రాష్ట్రంలో మహిళాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సీఎం పెద్దపీట వేశారు. గత టీడీపీ ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని విస్మరించింది. మహిళలు తమ హక్కుల కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేది. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి మహిళలకు పెద్ద పీట వేస్తూ వస్తున్నారు.

జగనన్నకు అండగా మహిళామణులు..

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేలా తోడ్పాటునిస్తూ పథకాలను అమలుచేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కార్యక్రమంలో మహిళలకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ ఆసరా, చేయూత, అమ్మఒడి వంటి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మద్యం రాకాక్షి మహిళల జీవితాలను నాశనం చేస్తుందనే కారణంతో మద్యం రేట్లు పెంచడంతో పాటు షాపులు తగ్గించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలంతా జగనన్నకు అండగా నిలుస్తున్నారు.

మహిళా సాధికారితకు జగనన్న పెద్దపీట..

అలాంటి మహిళలను టీడీపీ నేతలు ఆటబొమ్మలా చూస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అలాంటి రాబందుల నుంచి మహిళలను కాపాడటానికి జగనన్న తోడుగా ఉంటున్నారు. మహారాణులైన మహిళలు.. తల్లిలా లాలించడమే కాదు... రాణిలా పాలించగలరన్న విశ్వాసంతో మహిళలు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా బలంగా ఎదిగేందుకు సర్వదా కృషి చేస్తున్నారు సీఎం జగన్. అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. ఆ దుర్గమ్మ తల్లి దీవెనలతో మహిళలు అన్ని రంగాల్లో శక్తివంతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. విజయదుర్గా ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

More News

Bigg Boss 7 Telugu : మరోసారి లేడీ కంటెస్టెంటే.. బిగ్‌బాస్ నుంచి పూజా మూర్తి ఎలిమినేట్, హౌస్‌లోకి రతిక రీ ఎంట్రీ

బిగ్‌బాస్ హౌస్ 7లో ఆడవాళ్ల ఎలిమినేషన్ కొనసాగుతూనే వుంది. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాలేదు.

Telangana BJP candidates:తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. సీఎం కేసీఆర్‌పై ఈటల పోటీ

ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదలైంది. 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది.

BJP MP GVL:విశాఖ రాజధాని అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

విశాఖ రాజధాని అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరిసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Gamechanger:'గేమ్‌ఛేంజర్' మూవీ ఫస్ట్ సింగిల్ వాయిదా.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్

RRR మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో

Rajasingh:గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత.. ఎమ్మెల్యేగా పోటీ..?

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ అధిష్టానం శుభవార్త అందించింది.