బాల‌కృష్ణ‌, అల్లు అర్జున్‌ తో..

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

ఈ ఏడాది 'జై సింహా'తో క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. ఆ తర్వాత వినాయక్, సాయిధరమ్‌ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇంటిలిజెంట్' డిజాస్టర్‌గా మిగలడంతో నష్టాలు చవిచూశారు.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల‌ బాలకృష్ణ, వినాయక్ కలయికలో ఓ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు కళ్యాణ్. అంతేగాకుండా.. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. మే 27న లాంఛ‌న ప్రాయంగా షూటింగ్‌ ప్రారంభించి.. ఆపై నిరవధికంగా చిత్రీకరణను కూడా జరుపనున్నారు.

ఈ సినిమాతో పాటు.. అల్లు అర్జున్‌తో కూడా ఓ సినిమాను నిర్మించే ప్రయత్నంలో ఉన్నారట సదరు నిర్మాత. ఇటీవల ద‌ర్శ‌కుడు సంపత్ నంది.. అల్లు అర్జున్‌కు ఓ కథను వినిపించారని.. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత ఈ కొత్త చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.

త్వరలోనే ఈ రెండు భారీ సినిమాలకు సంబంధించి అధికారికంగా ఓ ప్రకటనను వెల్లడించనున్నారు నిర్మాత కళ్యాణ్.

More News

తార‌క్‌, త్రివిక్ర‌మ్ చిత్రానికి కంపోజింగ్ మొద‌లైంది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో

ప్ర‌త్యేకమైన స‌న్నివేశంతో 'యన్.టి.ఆర్' ఒక్క రోజు షెడ్యూల్‌

మహానటుడు నంద‌మూరి తార‌క రామారావు జీవితకథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే.

స‌మంత పాత్ర‌ని మించేలా అన‌సూయ పాత్ర‌

రామ్ చరణ్, సమంత నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’.

మ‌రికొంత ఆలస్యం కానున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ'

రవితేజ, మాళవిక శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’.

వెంకీ, వ‌రుణ్ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా..

విక్ట‌రీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్క‌నున్న‌ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’.