నాలుగేళ్ళ త‌రువాత బాల‌య్య‌తో..

  • IndiaGlitz, [Friday,May 11 2018]

రెండుత‌రాల‌కి చెందిన అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ విజ‌యాలు అందుకున్న సంగీత ద‌ర్శ‌కుల‌లో దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు. మ‌ణిశ‌ర్మ త‌రువాత ఆ ఘ‌న‌త ద‌క్కించుకున్న స్వ‌ర‌క‌ర్త దేవిశ్రీ‌నే. ప్ర‌తి అగ్ర క‌థానాయ‌కుడితోనూ రెండు లేదా అంత‌కుమించి అన్న‌ట్లుగా సినిమాలు చేసేసిన డీఎస్పీ.. బాలకృష్ణ విష‌యంలో ఒక సినిమాకే ప‌రిమితమ‌య్యారు. నాలుగేళ్ళ క్రితం విడుద‌లైన లెజెండ్ త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాలేదు.

అయితే.. త్వ‌ర‌లోనే వీరి కాంబోలో మ‌రో సినిమా రాబోతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. బాల‌య్య‌, వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్‌లో చెన్న‌కేశ‌వ‌రెడ్డి త‌రువాత మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం ఈ నెల 27 నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ నేప‌థ్యంలో సంగీత ద‌ర్శ‌కుడిగా దేవిశ్రీని ఎంచుకున్న‌ట్లుగా తెలిసింది. త్వ‌ర‌లోనే దేవిశ్రీ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. శ‌ర‌వేగంగా ఈ సినిమాని పూర్తిచేసి.. వ‌చ్చే సంక్రాంతికి సినిమాని విడుద‌ల చేసే దిశ‌గా నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

ఫిదా విడుద‌లైన రోజునే..

ఫిదా.. గ‌తేడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్ర‌మిది. వ‌రుణ్ తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమా..

'నేల టిక్కెట్టు' ఆడియో విడుద‌ల‌

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం “నేల టిక్కెట్టు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటించారు.

సైరా ఆగ‌మ‌నం ఎప్పుడంటే..

ఖైదీ నెం.150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. త‌న కెరీర్‌లో 150వ సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమాతో..

చైత‌న్య సంద‌డి అప్పుడే!

గ‌తేడాది వేస‌వికి రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ఓ మంచి విజ‌యాన్ని అందుకున్నారు యువ‌క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌. ఆ త‌రువాత చేసిన యుద్ధం శ‌ర‌ణం నిరాశ‌ప‌రిచింది.

'మెహ‌బూబా' నిడివి ఎంతంటే..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం మెహ‌బూబా. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ పున‌ర్జ‌న్మ‌ల  ప్రేమ‌క‌థా చిత్రం ద్వారా పూరీ త‌న‌యుడు పూరీ ఆకాష్