గోపీచంద్‌కు ఆ తేది మ‌రోసారి క‌లిసొస్తుందా?

  • IndiaGlitz, [Tuesday,April 10 2018]

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్ న‌టిస్తున్న 25వ చిత్రం 'పంతం'. మెహరీన్ నాయిక‌. ఈ చిత్రంతో కె.చక్రవర్తి (చక్రి) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ముందుగా మే 18న చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కాని కొన్ని కారణాల వల్ల‌ వాయిదా పడిన ఈ సినిమా.. ఇప్పుడు జూలై 5న విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది.

జూలై నెలలో గోపీచంద్ కెరీర్‌లో మంచి విజయాలే ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'యజ్ఞం'. 2004లో జూలై 2న విడుదలైన ఈ సినిమాతో హీరోగా తొలి విజయాన్ని అందుకున్నారు గోపీచంద్. అంతేగాకుండా.. గోపీచంద్, ద‌ర్శ‌కుడు శ్రీవాస్ జట్టుగా తెరకెక్కిన 'లక్ష్యం' (2007) కూడా ఇదే నెలలో అంటే జూలై 5న విడుదలై గోపీచంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

అలాగే.. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో రూపొందిన ప్రయోగాత్మక చిత్రం 'సాహసం'(2013). జూలై 12న విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా.. సంపత్ నంది దర్శకుడుగా తెరకెక్కిన 'గౌతమ్‌ నంద' కూడా గ‌తేడాది జూలై 28న విడుదలైంది.

కాకపోతే.. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.  మొత్త‌మ్మీద‌.. ఈ నెలలో మూడు సార్లు విజయాలను అందుకున్న గోపీచంద్.. ఇప్పుడు తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తేదీ (జూలై 5)న‌ 'పంతం'తో మ‌రోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి 'లక్ష్యం' ఫలితాన్ని 'పంతం' కూడా రిపీట్ చేస్తుందేమో చూడాలి.

More News

న‌రేష్ సినిమాలో పూర్ణ.. అయితే..?

సీమ ట‌పాకాయ్ అనే సినిమాలో అల్ల‌రి న‌రేశ్‌, పూర్ణ జ‌త‌గా న‌టించారు. ఇప్పుడు మ‌రోసారి అల్ల‌రి న‌రేశ్ సినిమాలో పూర్ణ న‌టించ‌నుంది.

నాగ‌శౌర్య చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

'ఛలో' విజ‌యం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా త‌రువాత త‌దుప‌రి ప్రాజెక్టుల

'కాలా' గురించి 'నా బంగారు తల్లి' ఏమందంటే..

'నా బంగారు తల్లి' సినిమాకుగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న‌ నటి అంజలి పాటిల్. ఆ తర్వాత పలు  హిందీ సినిమాలతో పాటు మరాఠి, ఆంగ్ల చిత్రాల్లోనూ నటిస్తూ వచ్చారు అంజ‌లి.

మెగా హీరోతో మరోసారి

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ త్వరలో ఓ మూవీలో నటించబోతున్న‌ సంగతి తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొంటున్న'సాక్ష్యం'

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాక్ష్యం' ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.