సైజ్ జీరో వాయిదా ప‌డుతుందా..?

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

అందాల తార అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తెర‌కెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పి.పి.పి బ్యాన‌ర్ పై తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుష్క న‌టించిన మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 9న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఆ త‌ర్వాత రుద్ర‌మ‌దేవి రిలీజ్ వాయిదా ప‌డుతుంద‌ని తెలిసి..సైజ్ జీరో అక్టోబ‌ర్ 9న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. ఇప్పుడు రుద్ర‌మ‌దేవి వాయిదా ప‌డ‌లేదు. అక్టోబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్నాం అంటున్నారు డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్. దీంతో సైజ్ జీరో టీం ఆలోచ‌న‌లో ప‌డింద‌ట‌.రుద్ర‌మ‌దేవి 9న రిలీజ్ కాక‌పోతే సైజ్ జీరో 9న వ‌స్తుంద‌ట‌. రుద్ర‌మ‌దేవి అక్టోబ‌ర్ 9న రిలీజ్ అయితే సైజ్ జీరో న‌వంబ‌ర్ కి వాయిదా ప‌డుతుంద‌ట‌. అది సంగ‌తి.

More News

'రోబో2'కి టెక్నికల్ టీమ్ కుదిరింది

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’, ‘శివాజీ’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

మహేష్ తో సినిమా నిర్మిస్తున్న డైరెక్టర్ ఎవరు...?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తున్నారు.

విక్రమ్ సినిమా ఆడియో రిలీజ్ డేట్..

ఐ’ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రదు కుళ్ళ’ సినిమా చేస్తున్నాడు.

అఖిల్ ను ప‌రిచ‌యం చేయ‌నున్న ర‌జ‌నీ..?

అక్కినేని వంశం నుంచి వ‌స్తున్న మూడోత‌రం యువ కెర‌టం అఖిల్. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 22న అఖిల్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు.

మూడోసారి పాటపాడిన శృతి...

శృతిహాసన్ చాలా సినిమాల్లో పాట పాడిన సంగతి తెలిసిందే. మరిప్పుడు మూడోసారి మాత్రమే పాడటమేంటని అనుకుంటున్నారా?