'యన్.టి.ఆర్' బ‌యోపిక్‌కు ఓకే చెబుతుందా?

  • IndiaGlitz, [Saturday,April 14 2018]

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను 'యన్.టి.ఆర్' పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోందీ చిత్రం.

ఈ పనుల్లో భాగంగా నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ నటులు, సీనియర్ నటులు నటిస్తుండగా.. ఈ ప్రతిష్ఠాత్మక వెంచర్‌లో ఓ బాలీవుడ్ నటీమణి కూడా నటించే అవకాశం ఉందని సమాచారం.

ఆ వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ని సంప్రదించిందట చిత్ర బృందం. ఆమెకు క‌థ న‌చ్చినా.. ఆమె వైపు నుంచి ఎటువంటి ధృవీక‌ర‌ణ రాక‌పోవ‌డంతో.. ఆమె కోసం గత మూడు వారాలుగా చిత్ర బృందం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

మే మొదటి వారం నుంచి సెట్స్ పైకి వెళ్లబోయే ఈ చిత్రానికి.. అప్పటికల్లా ఈ నటీమణి ఓకే చెప్పే అవకాశం ఉందని చిత్ర బృందం చెబుతోంది. ఇదిలా ఉంటే..

మే నుంచి ప్రారంభమయ్యే చిత్రీకరణలో బాలకృష్ణపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలని బాలకృష్ణ భావిస్తునట్లుగా సమాచారం.

More News

సుకుమార్, చిరు మధ్యలో రవితేజ?

‘రంగస్థలం’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ తర్వాత .. తను చేయబోయే ప్రాజెక్టులపై ద‌ర్శ‌కుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అందుకే తేజ్ టైటిల్ మారుతోందట‌

యువ క‌థానాయ‌కుడు సాయిధరమ్ తేజ్, కేర‌ళ‌కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

చ‌ర‌ణ్ నాకు త‌మ్ముడులాంటోడు!!... 'రంగ‌స్థ‌లం' సినిమాను ఆస్కార్‌కు పంపాలి - ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'.

మెహ‌రీన్ స్థానంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌?

ఐరా క్రియేషన్స్ సంస్థను స్థాపించి.. ఆ సంస్థలో మొద‌టి చిత్రంగా ‘ఛలో’ సినిమాను నిర్మించారు

వ‌రుణ్ చిత్రానికి రెండు వారాల వ‌ర్క్‌షాప్‌

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.