పూరీకి ఈసారైనా కలిసొస్తాడా?

  • IndiaGlitz, [Tuesday,May 08 2018]

‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సంగీత దర్శకుడు సందీప్ చౌతా. ఆ తర్వాత ‘చంద్రలేఖ’, ‘ప్రేమకథ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యారు. తెలుగుతో పాటు ప‌లు హిందీ చిత్రాల‌కు కూడా సంగీతం అందించారు. మ‌ధ్య‌లో వేరే భాష‌ల మీద దృష్టి పెట్ట‌డంతో తెలుగు సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఆ నేప‌థ్యంలో.. కొంత కాలం విరామం తర్వాత ఈయన సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సూపర్’. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా మెప్పించకపోయినా.. ఆడియో మాత్రం సంచలనం సృష్టించింది.

మళ్ళీ పూరి, సందీప్ కాంబినేషన్‌లో 2008లో ‘బుజ్జిగాడు’ సినిమా వచ్చింది. ఇది కూడా గత చిత్రం మాదిరిగానే కమర్షియల్‌గా విజ‌యం సాధించ‌క‌పోయినా.. ఆడియో పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కట్ చేస్తే.. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరి కలయికలో వస్తున్న మూవీ ‘మెహబూబా’. తాజాగా విడుదలైన ఈ మూవీలోని పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. అయితే గతంలో వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించలేదు. మరి ‘మెహబూబా’ అయినా వీరికి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. 1971  ఇండో-పాక్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో పూరి తనయుడు పూరి ఆకాష్, నేహా శెట్టి జంటగా నటించారు. ఈ సినిమా మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

న‌టుడిగా ప్ర‌తి సినిమాకు నేర్చుకుంటూనే ఉన్నాను - ఆకాశ్ పూరి

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌

'మహానటి'.. ఆ జాబితాలో చేరుతుందా?

మే 9.. తెలుగు సినిమాకు కలిసొచ్చిన తేదీల్లో ఒకటి. ఈ తేదీన విడుద‌లైన  కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించాయి.

నాని హీరోయిన్ డ‌బుల్ ధ‌మాకా

‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో కథానాయికగా పరిచయమైన మళయాళ కుట్టి మాళవికా నాయర్.

కేతరీన్ సరికొత్త డ్యాన్స్

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, స్టైల్ సాధించుకొన్న నటీమణి కేతరీన్ థెరీసా.

రెగ్యులర్ షూటింగ్‌లో సుమంత్ 25వ చిత్రం సుబ్రహ్మణ్యపురం

ఇటీవల మళ్ళీ రావా వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం