Anasuya:జనసేన తరపున ప్రచారం చేస్తా.. అనసూయ కీలక వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Wednesday,March 27 2024]

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. నేతల ప్రచారాలు, విమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా ఏపీలో అయితే మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే సినీ నటి అనసూయ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయకు రాజకీయాల గురించి ప్రశ్న ఎదురైంది. పవన్ కల్యాణ్‌ పిలిస్తే జనసేన తరపు ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇది వివాదం అవ్వొచ్చు కానీ.. అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను తప్పై ఉండొచ్చు. నాకు లీడర్స్‌తోనే పని. పొలిటికల్ పార్టీలతో కాదు. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తాను. జబర్దస్త్‌లో రోజా, నాగబాబు ఇద్దరితో కలిసి పనిచేశాను. నాకు నాగబాబు గారు బాగా క్లోజ్. ఒకవేళ అటు నుంచి రోజా గారూ.. ఇటు నుంచి నాగబాబు గారూ పార్టీలోకి పిలిస్తే.. వెళ్తాను.. ఆయా అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తాను. నాకు నాయకులతోనే పని. పార్టీలతో పని కాదు. నాకు చాలా పార్టీల నుంచి అనేక మంది లీడర్లు తెలుసు. వాళ్లని అభిమానిస్తాను.

వాస్తవంగా నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. మా నాన్న గారు రాజకీయాల్లో ఉండేవారు. ఆయన పాలిటిక్స్ మానేయడానికి కారణం నేనే. కానీ నేను ఈ సొసైటీలో ఉంటున్నాను కాబట్టి.. మంచి లీడర్‌ని ఎన్నుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. మంచి లీడర్‌ని ఎన్నుకోమని నేనే వేరే వాళ్లకి చెప్పడం.. వాళ్లు నా వినడం అది నా అదృష్టం. నేను చెప్తే వింటారు కాబట్టి.. కరెక్ట్‌గా చెప్పాలి. నేను చెప్తే వింటారని ఏది పడితే అది చెప్పడం తప్పు. సినిమా అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఒకవేళ జనసేన నుంచి ప్రచారం చేయమని అడిగితే తప్పకుండా వెళ్తాను. పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి.. ఆయన పిలిస్తే నేను వెళ్తాను. నేను వెళ్తే మాత్రం అభ్యర్థి గురించి పూర్తిగా తెలుసుకునే వెళ్తాను’ అంటూ వెల్లడించారు. దీంతో అనసూయ వ్యాఖ్యలను జనసైనికులు తెగ వైరల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఓ న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. తర్వాత జబర్దస్త్ యాంకర్‌గా పాపులర్ అయ్యారు. అనంతరం సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో వరుస అవకాశాలు రావడంతో జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పారు. ఆమె నటించిన రంగస్థలం, పుష్ప, యాత్ర, రంగమార్తాండ, రజాకార్, క్షణం చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం పుష్ప2, ఆరి చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

More News

Vijayamma:ఇడుపులపాయలో జగన్‌తో విజయమ్మ.. కుమారుడికే మద్దతా..?

ఏపీ సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పేరుతో నేటి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ముందుగా ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు.

Ram Charan:చిరంజీవి కొడుకు నుంచి గ్లోబల్ స్టార్ వరకు.. రామ్‌చరణ్ సినీ ప్రస్థానం..

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్. తన నటన, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న 'గ్యాంగ్‌లీడర్'.

CM Jagan:ఎన్నికల కురుక్షేత్రంలోకి సీఎం జగన్.. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర..

ఎన్నికల కురుక్షేత్రంలోకి సీఎం జగన్ దిగేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 'సిద్ధం'

Charan Couple:శ్రీవారిని దర్శించుకున్న చెర్రీ దంపతులు.. క్లీంకార ఫోటో రివీల్..

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజును మెగా అభిమానులు గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Game Changer:మెగా ఫ్యాన్స్‌కు చెర్రీ బర్త్‌డే గిఫ్ట్.. 'గేమ్‌ఛేంజర్‌' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..

దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.