అను ఐదో హిట్ కొడుతుందా?

  • IndiaGlitz, [Friday,September 08 2017]

'మ‌జ్ను' చిత్రంతో తెలుగువారికి ప‌రిచ‌య‌మైన క‌థానాయిక అను ఎమ్మానియేల్‌. ఆ త‌రువాత 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'తో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ప‌వ‌న్ క‌ళ్యాణ్ , త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న కొత్త చిత్రంలోనూ.. అల్లు అర్జున్ చిత్రం 'నా పేరు సూర్య‌'లోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే గోపీచంద్‌తో జోడీక‌ట్టిన 'ఆక్సిజ‌న్' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ రూపొందించ‌నున్న కొత్త చిత్రంలోనూ అనుని హీరోయిన్‌గా ఎంచుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. త‌మిళంలో ఈ ముద్దుగుమ్మ న‌టించిన తొలి చిత్రం 'తుప్ప‌రివాల‌న్' (విశాల్ హీరో) ఈ నెల 15న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు అను నాలుగు చిత్రాల్లో న‌టిస్తే అవ‌న్నీ హిట్ అయ్యాయి. మ‌ల‌యాళంలో 'స్వ‌ప్న‌సంచారి', 'యాక్ష‌న్ హీరో బిజు', తెలుగులో 'మ‌జ్ను', 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌' రూపంలో నాలుగు విజ‌యాలు అందుకున్న అను.. 'తుప్ప‌రివాల‌న్‌'తో ఐదో విజ‌యం త‌న ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

More News

విజయ్ దేవరకొండ తో క్రాంతి మాధవ్

'ఓనమాలు','మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రాల తో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు క్రాంతి మాధవ్.

సచిన్ 'వీడెవడు' సెప్టెంబర్ 15న విడుదల

మౌనమేలనోయి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సచిన్ 'ఒరేయ్ పండు' 'నీజతగా నేనుండాలి''వీరప్పన్' చిత్రాలతో

సెప్టెంబర్ 9న చెన్నైలో 'స్పైడర్' ఆడియో సెప్టెంబర్ 15న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్ మధు సమర్పణలో

రజనీకాంత్‌, శంకర్‌ '2.0' ఆడియో, టీజర్ రిలీజ్ వివరాలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'.

శ్రియకి రెండు అలాంటివే

బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' లో వశిష్టీదేవిగా మెప్పించింది అందాల నటి శ్రియ.