'రంగస్థలం' లో ఆ ఇద్దరు ఎవరై ఉంటారు?

  • IndiaGlitz, [Saturday,February 17 2018]

ప్రేయసి ప్రేమను పొందడానికి ఆమెను పొగుడుతూ ప్రియుడు చాలా అందమైన పాటలు పాడుతూ ఉంటాడు. రంగస్థలం' సినిమా నుంచి అలాంటి పాటను ఇటీవల విడుదల చేసింది చిత్ర బృందం. రామలక్ష్మి(సమంత) అందాన్ని చూసి చిట్టిబాబు(రామ్ చరణ్) పాడేసిన “ఎంత సక్కగున్నావే లచిమి” పాట ఇప్పటికే శ్రోతలను అలరిస్తోంది.

అయితే ఈ చిత్రం నుంచి త్వరలో రంగమ్మ, మంగమ్మ' అంటూ మరో పాటను చిట్టిబాబు పాడ‌బోతున్నాడు. త్వరలో ఈ పాటను సోషల్ మీడియాలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమాలో రంగమ్మ, మంగమ్మ ఎవరై ఉంటారని మెగా అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కొంతమంది ఇది ఐటెం సాంగ్ అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇదిలా వుంటే...సినిమాలో ఈ పాటే ప్రత్యేక ఆకర్షణ నిలవనుందని చిత్ర యూనిట్ తెలుపుతోంది. మరి ఆ రంగమ్మ, మంగమ్మ' ఎవరో తెలియాలంటే విడుదల వరకు వేచి ఉండాల్సిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

ప్రియదర్శికి రెండు సినిమాల్లోనూ కౌంటర్

2016లో 'టెర్రర్ ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు ప్రియదర్శి.అయితే ‘పెళ్లిచూపులు’ చిత్రంతో

వేసవి సందడి.. సమంతదే

గత నాలుగేళ్ళుగా వేసవిలో తన సినిమాలతో..సమంత బాగానే సందడి చేస్తోంది.

సుకుమార్.. ముచ్చటగా మూడోసారి

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా పరిచయమై 14 ఏళ్లు అవుతోంది.

నితిన్ జోడీగా రాశి ఖ‌న్నా?

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'తొలి ప్రేమ' సినిమా విజ‌యంతో మ‌రోసారి ప‌రిశ్ర‌మ దృష్టిలో ప‌డింది ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ సినిమాలో వ‌ర్ష పాత్ర‌లో యువ‌త‌రాన్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌ని..తాజాగా ఓ మంచి అవ‌కాశం వ‌రించింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

వరుణ్ మెగా కుటుంబం గర్వపడే సినిమా చేశాడు: మెగాస్టార్ చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన 'తొలిప్రేమ'