మాజీ సీఎం చంద్రబాబు చేతికి ఏమైంది..!?
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి ఏమైంది..? ఆయన ఎందుకు కుడి చేతికి కట్టుకున్నారు..? అనేదానిపై ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. మంగళవారం నాడు విజయవాడలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి చేతికి కట్టుతోనే చంద్రబాబు హాజరుకావడంతో అందరూ ఏమైంది..? ఏమైంది..? ప్రశ్నించసాగారు. కుడి చేతికి గాయమైనట్లు పార్టీకి చెందిన సీనియర్ నేతలు మీడియాకు వివరించారు. అయితే చేతి కట్టుతోనే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాజీ సీఎం ప్రసంగిస్తున్న టైమ్లో బాబువైపే వీరాభిమానులు, కార్యకర్తలు, నేతలు తథేకంగా చూడసాగారు. కాగా.. చేతి నరంపై ఒత్తిడి పెరగడంతో వైద్యులు ఆయనకు కట్టుకట్టినట్టు సమాచారం.
150 మంది సభ్యులు ఉన్నామంటూ అధికార పార్టీ అసెంబ్లీలో బెదిరిస్తోందని తీవ్రస్థాయిలో చంద్రన్న మండిపడ్డారు. వైసీపీ వాళ్ల లాగే మేం లేస్తే తట్టుకోలేరు..? ఏ ఒక్కరూ మిగలరని చంద్రబాబు హెచ్చరించారు. గ్రామ వాలంటీర్ల పేర్లతో ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి ప్రాభవం కోల్పోయిందని బాబు చెప్పుకొచ్చారు. బాబు కామెంట్స్పై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments