మాజీ సీఎం చంద్రబాబు చేతికి ఏమైంది..!?

  • IndiaGlitz, [Tuesday,August 13 2019]

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి ఏమైంది..? ఆయన ఎందుకు కుడి చేతికి కట్టుకున్నారు..? అనేదానిపై ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. మంగళవారం నాడు విజయవాడలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి చేతికి కట్టుతోనే చంద్రబాబు హాజరుకావడంతో అందరూ ఏమైంది..? ఏమైంది..? ప్రశ్నించసాగారు. కుడి చేతికి గాయమైనట్లు పార్టీకి చెందిన సీనియర్ నేతలు మీడియాకు వివరించారు. అయితే చేతి కట్టుతోనే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాజీ సీఎం ప్రసంగిస్తున్న టైమ్‌లో బాబువైపే వీరాభిమానులు, కార్యకర్తలు, నేతలు తథేకంగా చూడసాగారు. కాగా.. చేతి నరంపై ఒత్తిడి పెరగడంతో వైద్యులు ఆయనకు కట్టుకట్టినట్టు సమాచారం.

150 మంది సభ్యులు ఉన్నామంటూ అధికార పార్టీ అసెంబ్లీలో బెదిరిస్తోందని తీవ్రస్థాయిలో చంద్రన్న మండిపడ్డారు. వైసీపీ వాళ్ల లాగే మేం లేస్తే తట్టుకోలేరు..? ఏ ఒక్కరూ మిగలరని చంద్రబాబు హెచ్చరించారు. గ్రామ వాలంటీర్ల పేర్లతో ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి ప్రాభవం కోల్పోయిందని బాబు చెప్పుకొచ్చారు. బాబు కామెంట్స్‌పై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

మెగా కానుక సిద్ధమవుతోంది...

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

‘సాహో’ రిలీజ్‌కు ముందే ప్రభాస్ సర్‌ఫ్రైజ్.. ఫ్యాన్స్ ఫిదా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ దర్శకత్వంలో

పరిశీలనలో మరో టైటిల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ చిత్రీకరణను జరుపుకుంటోంది.

హాట్ భామ సీక్రెట్ పెళ్లి.. 4 కోట్లివ్వాలని మాజీ ప్రియుడు డిమాండ్

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్.. ఎన్నారై రితీశ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే.

నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా..‘రణరంగం-2’ కూడా: సుధీర్ వర్మ

హీరో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ నటీనటులుగా సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రణరంగం’.