close
Choose your channels

Prime Minister Modi:ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన..

Saturday, November 11, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో ఓ కమిటీ వేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. అనేది బీజేపీ విధానం.. పేదరిక నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఎన్నో ప్రభుత్వాలు మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాయి కానీ నెరవేర్చలేదన్నారు. కానీ మీ బాధలు పంచుకునేందుకే ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ ముప్పై ఏళ్లుగా ఒక లక్ష్యం కోసం ఉద్యమిస్తున్నారన్నారు. తమ్ముడు కృష్ణా ఇన్నాళ్లు మీరు పోరాడారు... మీ ఉద్యమంలో తాను కూడా ఉంటానని భరోసా ఇస్తున్నానని చెప్పారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయలేదన్నారు. అధికారంలోకి రాగానే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత్ విరోధులు అని.. ఆ రెండు పార్టీలతో మాదిగలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్‌ను రెండుసార్లు ఓడించారని.. కానీ బీజేపీ హయాంలో పార్లమెంట్ సెంట్రల్ హాలులో అంబేడ్కర్ చిత్రపటం పెట్టామని భారతరత్న ఇచ్చామన్నారు. దళిత వర్గాలకు చెందిన రామ్ నాథ్ కోవింద్‌ను, గిరిజన మహిళను తొలిసారిగా రాష్ట్రపతిగా చేశామని గుర్తుచేశారు.

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్జ మాదిగ మాట్లాడుతూ మాదిగల్ని సమాజంలో మనుషులుగా చూడలేదని తాము ఎదురైతే దూరం దూరం వెళ్లేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను పశువుల కంటే హీనంగా సమాజం చూసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సమాజంలో మనల్ని గుర్తించి, మన సమస్యల్ని తెలుసుకునేందుకు దేశానికి పెద్దన్న అయిన ప్రధాని మోదీ వచ్చారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రసంగం అనంతరం మోదీ వద్దకు వెళ్లి కంటతడి పెట్టారు. దీంతో మోదీ మందకృష్ణను భుజం తట్టి ఓదార్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లా మాటలు చెప్పే పార్టీ బీజేపీ కాదన్నారు. బీసీని సీఎం చేస్తానని చెప్పిన దమ్మున్న నేత మోదీ అని కొనియాడారు. పేద కుటుంబం నుంచి వచ్చిన బీసీ వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాడుతున్నారని.. ఆయన ఎన్నో అవమానాలకు గురైన ఏనాడూ ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని ప్రశంసించారు. తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం పలు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి కానీ ఎవరూ నెరవేర్చలేదన్నారు. ఇటీవల ప్రధాని మోదీకి వర్గీకరణ గురించి ఆయనకు చెబితే అంగీకరించారని వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment