Manchu Family :ఏపీలో ఆ పార్టీలకే ఓటు వేయండి.. మంచు కుటుంబం వ్యాఖ్యలు వైరల్..

  • IndiaGlitz, [Wednesday,March 20 2024]

తిరుపతిలో జరిగిన మోహన్ బాబు(Mohan Babu) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, ముఖేష్ రుషి పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్‌లో మంచు కుటుంబం రాజకీయ ప్రసంగాలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మంచు మనోజ్ స్పీచ్(Manchu Manoj) అయితే తెగ వైరల్ అవుతోంది.

వాళ్ల ఫ్యామిలీకే హెల్ప్‌చేయనివాళ్లు. వాళ్ల చుట్టుపక్కల వారికే హెల్ప్ చేయనివాళ్లు. మీకేం హెల్ప్‌ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని.. కరెక్ట్‌గా చూజ్‌ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్లకు ఏ లీడర్ వస్తే సపోర్టివ్‌గా ఉంటుందో అనలైజ్ చేసి కరెక్ట్‌గా ఓటు వేయండి. కష్టాల్లో ఉండి ఎక్కువ డబ్బు ఇచ్చే వాళ్లు ఉంటే వద్దని మీకు చెప్పను. ఆ డబ్బు ఇచ్చాడని ఓటు వేయొద్దు. డబ్బు ఇస్తే థాంక్యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్లకు ఓటు వేయండి. పదిమందిని కలుపుకొని వెళ్లే లీడర్‌ని వెతుక్కోండి అని మనోజ్ తెలిపాడు.

ఇక మోహన్ బాబు కూడా ఈసారి పొలిటికల్ స్పీచ్ చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీని చాలా సందర్భాల్లో కలిశాను. అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి దేశానికి అవసరం. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. రాష్ట్రంలో రెండు పార్టీలకు చెందిన వారు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మనవే.. లంచాలు తీసుకున్న డబ్బులు.. ఆ డబ్బులు తీసుకోండి. ఓటును మాత్రం నచ్చిన వారికి వేయండి. రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి సహకరించండి. అని సూచించాడు.

దీంతో మంచు కుటుంబం చేసిన రాజకీయ ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి. ఇంత సడెన్‌గా అది కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. మోహన్ బాబు మోదీకి సపోర్ట్‌గా మాట్లాడారు అంటే టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి ఓటు వేయమని పరోక్షంగా చెప్పినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మనోజ్ వ్యాఖ్యలు కూడా పరోక్షంగా వైసీపీ నేతలకు ఓటు వేయొద్దని.. టీడీపీ, జనసేనకు ఓటు వేయమని సూచించినట్లు ఉన్నాయని భావిస్తున్నారు.

కాగా 2019 ఎన్నికల సమయంలో మంచు కుటుంబం మొత్తం వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ప్రకటించింది. తన యూనివర్సిటీకి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వడం లేదంటూ రోడ్డు మీద పడుకుని మరి ధర్నాలు చేశారు. మోహన్ బాబు అయితే బహిరంగంగా చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. జగన్‌తో కలిసి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే జగన్ సీఎం అయిన తర్వాత సైలెంట్‌ అయిపోయారు. ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా పరోక్షంగా పనిచేస్తున్నట్లు అర్థమవుతోంది.

More News

KTR:ముఖ్యమంత్రి గారు.. రైతుల కన్నీళ్లు కనిపించవా..?: కేటీఆర్

రైతులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

TDP: ఎలివేషన్లు బారెడు.. వచ్చిన సీట్లు చారెడు.. ఇది టీడీపీ తీరు..

టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చే బిల్డప్‌లు ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తానే గతంలో రాష్ట్రపతిని ఎంపిక చేశాను అంటారు.. కంప్యూటర్ కనిపెట్టాను అంటారు.. ఫోన్ కనిపెట్టాను అంటారు..

Ramcharan:ఘనంగా ప్రారంభమైన రామ్‌చరణ్ కొత్త సినిమా

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం

Election:దేశంలో మొదలైన ఎన్నికల సందడి.. తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల..

దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం మొదలైంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

CP Radhakrishnan:తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్

తెలంగాణ గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అధారే