పాట పాడబోతున్న విష్ణు..?

  • IndiaGlitz, [Thursday,July 27 2017]

మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న చిత్రం 'వోట‌ర్‌'. అడ్డా ఫేమ్ జి.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో ఓ పాట‌ను మంచు విష్ణు పాడబోతున్నాడ‌ని స‌మాచారం. ఇంత‌కు ఆ పాట ఎన్నిక‌లు వేసే ప్ర‌జ‌ల‌కు సంబంధించిన పాట. మ‌న‌దేశ జ‌నాభా 130 కోట్లుపైమాటే. కానీ ఇందులో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎంత మంది త‌మ ఓటును ఉప‌యోగించుకుంటున్నారు.
డ‌బ్బుతో ఓటు వేసే ప్ర‌జ‌ల‌ను రాజ‌కీయ నాయ‌కులు త‌ర్వాత ప‌ట్టించుకోవ‌డం లేదు. కాబ‌ట్టి ప్ర‌జ‌ల్లో ఓటు విలువ‌ను తెలియ‌జేప్పెలా ఓ సాంగ్‌ను వోట‌ర్ సినిమా కోసం రాయించార‌ట‌. ఈ సాంగ్‌ను మంచు విష్ణు పాడ‌నున్నాడు. ఈ సినిమాతో విష్ణు త‌మిళంలో కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. త‌మిళంలో ఈ చిత్రానికి 'కుర‌ల్ 388' అనే టైటిల్‌ను నిర్ణ‌యించార‌ట‌.