యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో విశాల్...

  • IndiaGlitz, [Monday,July 25 2016]

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత రాయుడుతో మరో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన మాస్‌ విశాల్‌ కొత్త చిత్రం కత్తిశండై ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపకుంటోంది. 'రాయుడు' చిత్ర నిర్మాత జి.హరి హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ఈ భారీ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టిస్తున్నాడు. త‌రుణ్ అరోరో మ‌రో విల‌న్‌గా క‌న‌ప‌డ‌తారు. ప్ర‌స్తుతం ఈ సినిమా క‌నల్ కణ్ణ‌న్ నేతృత్వంలో యాక్ష‌న్ పార్ట్‌ను చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. పూజ త‌ర్వాత క‌న‌ల్ కణ్ణ‌న్‌తో క‌లిసి వ‌ర్క్ చేస్తున్నాన‌ని హీరో విశాల్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశాడు. తెలుగు, తమిళంలో సినిమాను ఓకేసారి విడుదల చేయడానికి నిర్మాత హరి ప్లాన్ చేస్తున్నారు.