బస్సుల పై విశాల్ గుస్సా

  • IndiaGlitz, [Monday,December 19 2016]

తెలుగువాడైన త‌మిళ హీరో విశాల్ ఇప్పుడు ఒక్క‌డొచ్చాడు సినిమాతో త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో విశాల్ బిజీగా ఉన్నాడు. సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ప్ర‌తి సినిమా ఫేస్ చేసే మొద‌టి స‌మ‌స్య పైర‌సీ. దీనిపై విశాల్ చాలా కాలంగా పోరాటం చేస్తున్నాడు.

ఇప్సుడు కూడా విశాల్ మ‌రోసారి పైర‌సీపై త‌న గ‌ళాన్ని వినిపించాడు. అందులో బాగంగా నైట్ స‌ర్వీస్ బ‌స్సుల‌పై విశాల్ త‌న అనుమానాన్ని వ్య‌క్తం చేశాడు. బ‌స్సుల్లో దొంగ సీడీల‌ను ప్లే చేస్తార‌ని కాబ‌ట్టి అటువంటి ప‌నులు జ‌ర‌గ‌కుండా ప్యాసింజ‌ర్స్ స‌పోర్ట్ చేయాల‌ని ఎవ‌రైనా అలా బ‌స్సుల్లో పైర‌సీ సీడీల‌ను ప్లే చేస్తుంటే త‌న దృష్టికి తీసుకురావాల‌ని విశాల్ విజ్ఞ‌ప్తి చేశాడు.