శ‌ర‌త్ కుమార్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విశాల్

  • IndiaGlitz, [Friday,March 04 2016]

శ‌ర‌త్ కుమార్ పై హీరో విశాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. ఇంత‌కీ విశాల్ ఫిర్యాదు చేయ‌డానికి కార‌ణం ఏమిటంటే...న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు వివాద‌స్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో శ‌ర‌త్ కుమార్ వ‌ర్గం పై విశాల్ వ‌ర్గం గెలుపొందింది. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రికి భేధాభిప్రాయాలు వ‌చ్చాయి.

అయితే ఎన్నిక‌లు జ‌రిగి చాలా రోజులు అయినా...వీరిద్ద‌రి మ‌ధ్య పోరు మాత్రం ఆగ‌లేదు. అయితే గ‌తంలో న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన శ‌ర‌త్ కుమార్ అవినీతికి పాల్ప‌డ్డారంటూ విశాల్ వ‌ర్గం చెన్నై పోలీస్ క‌మీష‌నర్ కు ఫిర్యాదు చేసారు. కోట్లాది రూపాయ‌ల అవినీతికి పాల్ప‌డ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే శ‌ర‌త్ కుమార్ మాత్రం లెక్క‌లు అన్నీ అప్ప‌చెప్ప‌న‌ని..కావాల‌నే త‌న‌పై కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో కోలీవుడ్ వాతావ‌ర‌ణం వేడెక్కింది. మ‌రి...చెన్నై పోలీసులు ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.

More News

స‌ర్ధార్ లో..చిరు సాంగ్ కి ప‌వ‌న్ స్టెప్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప‌వ‌న్ - కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.

ఉమెన్స్ డే కోసం శృతిపాట...

ప్రస్తుతం నార్త్,సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న కమల్ హాసన్ గారాల తనయ శృతిహాసన్ బేసిక్ గా మ్యూజిషియన్ అండ్ సింగర్ కూడా అన్న సంగతి అందరికీ తెలిసిందే.

వందకు పైగా సెంటర్స్ లో సోగ్గాడు అర్థశత దినోత్సవం..

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ...నిర్మించిన సంచలన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

ప్రయోగానికి రెడీ అవుతున్న యంగ్ హీరో..

ఊహలు గుసగుసలాడే,దిక్కులు చూడకు రామయ్య...చిత్రాలతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యంగ్ హీరో నాగశౌర్య.

18న వస్తున్న ధనుష్ - కాజల్ 'మాస్'

సూపర్ మాస్ హీరో ధనుష్-సూపర్ బ్యూటి కాజల్ జంటగా నటించగా తమిళంలో మంచి విజయం సాధించిన 'మారి'