ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించిన మహిళ.. చీర కొంగుతో వందల మందికి ప్రాణ భిక్ష

  • IndiaGlitz, [Saturday,April 02 2022]

రైల్వే ట్రాక్‌పై నడుస్తుండగా పట్టా విరిగిపోవడమో, లేదంటే మరేదైనా కారణం వల్ల రైలు ప్రమాదంలో వుందని తెలిస్తే... ఎరుపు రంగుతో వున్న ఏదైనా వస్త్రాన్ని తీసి పైలెట్‌కు సిగ్నల్‌గా చూపిస్తూ వందలాది మంది ప్రాణాలను కాపాడే సీన్లు మనం ఎన్నో సినిమాల్లో చూశాం. అలాంటిది ఆ తరహా ఘటన నిజంగా జరిగితే.. ఓ మహిళ సమయస్పూర్తి, సాహసం కారణంగా వందలమంది ప్రాణాలతో బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌‌ప్రదేశ్‌ రాష్ట్రం ఎటా జిల్లా అవగాడ్‌ మండలం గులేరియా వాసికి చెందిన ఓంవతీ దేవి ప్రతిరోజూ రైలు పట్టాల మీదుగా తన పొలానికి వెళ్లేది. అయితే ఓ రోజున తన పోలానికి వెళుతుండగా .. కుస్బా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు విరిగి ఉండటాన్ని ఆమె గమనించింది. రైల్వే అధికారులకు సమాచారం అందించేంత సమయం లేదు. అంతేకాదు.. ఆ మార్గంలో ట్రైన్ వస్తున్నట్టు ఎక్కడో కూత వినిపిస్తోంది. ఆ టెన్షన్‌లో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు.

దీంతో రెండు నిమిషాలు ఆలోచించిన ఓంవతీ దేవికి ఓ ఐడియా వచ్చింది. రైలు పట్టాలు విరిగిపోయిన ప్రదేశం నుంచి కాస్త దూరం రైలు వస్తున్న వైపు ముందుకు వెళ్లింది. రెండు కొమ్మలను పాతిపెట్టి వాటికి తాను కట్టుకున్న చీరను విప్పేసి కట్టింది. పట్టాలకు ఎదురుగా ఎరుపు రంగు చీరను చూసిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. అనంతరం కిందకి దిగి వివరాలు తెలుసుకున్నాడు.

ఆమె చేసిన సాహసాన్ని రైల్వే సిబ్బందితో పాటు ప్రయాణీలకు అభినందించారు. అంతేకాదు ఆమెకు కొంత నగదు అందజేశారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలను, వీడియోను ఉత్తర్‌ప్రదేశ్‌‌కే చెందిన పోలీసు అధికారి సచిన్ కౌషిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

More News

ఆర్ఆర్ఆర్‌కు సీక్వెల్ .. కన్ఫర్మ్ చేసిన విజయేంద్ర ప్రసాద్, అంతా ఓకే మరి ముగ్గురికీ డేట్స్ కుదిరేదెప్పుడు..?

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

మాస్ మహారాజా ఫ్యాన్స్‌కి ఉగాది ట్రీట్..  “టైగర్‌ నాగేశ్వరరావు” నుంచి ప్రీ లుక్‌

మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది ఖిలాడి మూవీని రిలీజ్ చేసిన ఆయన...

కో డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులు.. 'ఊ అంటావా' సాంగ్ కొరియోగ్రాఫర్‌పై కేసు

చెన్నైకి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వివాదంలో చిక్కుకున్నారు. తనను లైంగిక వేధిస్తున్నాడంటూ అతడి కోడాన్సర్ ఆయనపై 2020లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

అన్నయ్య అందుకే అలా మారిపోయారు.. పరుచూరి షాకింగ్ లుక్‌‌పై గోపాలకృష్ణ రియాక్షన్

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుతో దర్శకుడు జయంత్ సీ పరాన్జీ దిగిన ఓ ఫోటో ఇటీవల సోషల్ మీడియాలోనూ, తెలుగు చిత్ర పరిశ్రమలను హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, ఏకంగా రూ.250 పెంపు, కొత్త రేట్లు ఇవే

ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచింది కేంద్ర సర్కార్ . దీనిపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలకు సైతం సిద్ధమవుతున్నాయి.