విక్రమ్ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వెనక్కి...

  • IndiaGlitz, [Friday,August 07 2015]

ఐ' చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎన్రత్తు కుల్ల' సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని వినికిడి. ప్రస్తుతం సినిమా శరవేగంగా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఛార్మి స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఈ సినిమాని ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారు. అయితే సినిమా నిర్మాణం పూర్తి కాకపోవడంతో సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తుందట.