విజ‌య‌శాంతి రీ ఎంట్రీ అందుకే ఆల‌స్య‌మైందా?

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

లేడీ అమితాబ్‌, రాముల‌మ్మ దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత వెండితెర‌పై క‌న‌ప‌డ‌బోతున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'స‌రిలేరు నీకెవ్వ‌రు'. ఇందులో విజ‌య‌శాంతి భార‌తి అనే ప్రొఫెస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. అయితే నిజానికి విజ‌యశాంతితో సినిమా చేయాల‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అనుకున్నాడు. కానీ కుద‌ర‌లేద‌ట‌.

అస‌లు విష‌య‌మేమంటే..అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా న‌టించిన చిత్రం 'రాజా ది గ్రేట్‌'. ఈ సినిమాను ముందుగా రామ్‌తో తెర‌కెక్కించాల‌ని అనుకున్నాడ‌ట అనిల్ రావిపూడి. రామ్ త‌ల్లి పాత్ర‌లో ముందుగా విజ‌య‌శాంతిని అనుకున్నాడ‌ట‌. విజ‌య‌శాంతిని క‌లిసి క‌థ‌ను కూడా చెప్పాడ‌ట‌. ఆమె కూడా ఓకే అంద‌ట‌. అయితే చివ‌ర‌కు రామ్ ఆ ప్రాజెక్ట్‌ను చేయ‌న‌ని చెప్పాడ‌ట‌. చివ‌ర‌కు ఆ సినిమాను ర‌వితేజ చేయ‌డానికి ఓకే చెప్పాడు. ర‌వితేజ త‌ల్లిగా చేయ‌డానికి విజ‌య‌శాంతి ఒప్పుకోలేదు. ఆ స‌మ‌యంలోనే అనిల్‌తో మంచి పాత్ర కుదిరితే మ‌రో సినిమా చేస్తాన‌ని విజ‌య‌శాంతి చెప్పార‌ట‌. చివ‌ర‌కు మ‌హేశ్ సినిమాలో మంచి పాత్ర ద‌క్క‌డంతో న‌టిస్తాన‌ని చెప్పార‌ట‌. అలా విజ‌య‌శాంతి రీ ఎంట్రీ కాస్త ఆల‌స్య‌మైంది.

మ‌హేశ్‌, ర‌ష్మిక హీరో హీరోయిన్లుగా న‌టించిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. ఇందులో విజ‌యశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

More News

మా 'జార్జ్ రెడ్డి' యూత్ కి కనెక్ట్ అయ్యాడు - దర్శకుడు జీవన్ రెడ్డి,సినిమాటోగ్రాఫర్ సుధాకర్ యక్కంటి

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జిరెడ్డ ఈ శుక్రవారం (22న) విడుదలయి సూపర్ హిట్ టాక్ ని సొంత చేసుకుంది.

సంపత్ శ్రీను దర్శకత్వంలో శ్రీను.కె నిర్మాతగా ప్రొడక్షన్ 2 ప్రారంభం

ఎస్ పి క్రియేషన్స్ సమర్పణలో యస్.యస్.సి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్2గా సంపత్ శ్రీను దర్శకత్వంలో

నిత్యానంద ఆశ్రమంలో బాలికలకు టార్చర్... వీడియోలు చేయాలంటూ హింసించిన వైనం

వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకెక్కారు. మైనర్ బాలికలను అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని

ఎక్స్‌క్లూజివ్‌...డైరెక్ట‌ర్‌కి డ‌బ్బులివ్వ‌ని స్టార్ నిర్మాత‌

సినిమా రంగంలో పైకి క‌న‌ప‌డే ఆప్యాయ‌త‌లు, అనురాగాలు వేరు.. కానీ లోపల‌ జ‌రిగే విష‌యాలు వేరుగా ఉంటాయి.

హీరో శ్రీకాంత్  చేతుల మీదుగా 'అప్పుడు-ఇప్పుడు' సాంగ్ లాంచ్

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో