రాములమ్మ మళ్ళీ ఆ పార్టీలోకి ?

  • IndiaGlitz, [Monday,November 23 2020]

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి పార్టీ మార్పు విషయమై క్లారిటీ వచ్చేసింది. దుబ్బాక ఫలితానికి ముందు వరకూ సందిగ్ధంలో ఉన్న రాములమ్మ ఆ తరువాత మాత్రం పార్టీ మార్పుపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే విజయశాంతి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వెళ్లి వచ్చిన అనంతరమే బీజేపీ తరుపున ప్రచారంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

రాములమ్మ ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మంగళవారం రాములమ్మ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విజయశాంతి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్.. రాములమ్మను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు.

More News

‘నివర్’గప్పుతున్న తుపాను.. 26 వరకూ భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు మరో తుపాను ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కన్నీటి పర్యంతమైన రానా దగ్గుబాటి

అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ చేస్తున్న సామ్‌జామ్ కార్యక్రమానికి అతిథిగా రానా దగ్గుబాటి హాజరయ్యాడు.

సముద్రంలో స‌మంత సాహ‌సం

స‌మంత అక్కినేని.. పెళ్లి త‌ర్వాత సినిమాల్లో న‌టిస్తుంది. కానీ, గ‌త ఏడాది ‘ఓ బేబి’ స‌క్సెస్ త‌ర్వాత మ‌రో సినిమాలో మాత్రం ఇంత వ‌ర‌కు న‌టించ‌లేదు స‌రిక‌దా..

స్టార్ హీరోతో తరుణ్ భాస్కర్

‘పెళ్లిచూపులు, ఈన‌గ‌రానికిఏమైంది’ చిత్రాల త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్ మ‌రో సినిమాను డైరెక్ట్ చేయ‌లేదు.

‘క్రాక్’ సినిమాకు లీగ‌ల్ స‌మ‌స్య‌..!

ర‌వితేజ, శృతిహాస‌న్ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘క్రాక్’.