Kushi:'ఖుషి' కలెక్షన్ల ఊచకోత.. మూడు రోజుల్లో 70.23 కోట్ల వసూళ్లు, అమెరికాలో 2 మిలియన్ల దిశగా

  • IndiaGlitz, [Monday,September 04 2023]

విజయ్ దేవరకొండ, సమంత జంటగా ప్రేమ కథల స్పెషలిస్ట్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘‘ఖుషి’’. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చార్ట్‌బస్టర్ పాటలు, ట్రైలర్‌తో భారీ హైప్ సంపాదించుకున్న ఖుషికి మంచి స్పందన వచ్చింది. అంతేకాదు.. ఈ సినిమా విజయ్ దేవరకొండకు అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. మూడు రోజుల్లో 70.23 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా యూఎస్‌లో ఖుషి బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది. వీకెండ్ ముగిసే నాటికి ఈ సినిమా 1.4 బిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టి 2 మిలియన్ల దిశగా పరుగులు తీస్తోంది. ఖుషి ఓవర్సీస్ హక్కులు రూ.5.5 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం లాభాల్లోకి ఎంటర్ కానుంది. వీక్ డేస్‌లోనూ ఖుషికి మెరుగైన వసూళ్లు వస్తాయని అంచనా.

సమంత అరుదైన్ ఫీట్:

అటు ఖుషి సినిమాతో సమంత అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇది ఆమె కెరీర్‌లో 17వ మిలియన్ డాలర్ మూవీ. ఇప్పటి వరకు మరే ఇతర దక్షిణాది హీరోయిన్ కూడా ఈ మార్క్ చేరుకోలేదు. గతంలో తాను నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సామ్ వన్ మిలియన్ డాలర్లు సంపాదించారు. ఇప్పటి వరకు బాగానే వుంది కానీ.. సోమవారం నుంచి ఖుషి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన చేయబోతుందో చూడాలి. నైజాం, వైజాగ్, ఇతర ఏరియాల్లో ఖుషికి సాలీడ్ కలెక్షన్లు వచ్చాయి.

యాదాద్రిలో ఖుషి టీమ్ :

కాగా.. ఖుషి సూపర్‌హిట్ కావడంతో చిత్ర యూనిట్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంది. హీరో విజయ్ దేవరకొండ, ఆయన పేరెంట్స్, తమ్ముడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది తమ కుటుంబానికి చాలా కలిసొచ్చిందన్నారు. తన సోదరుడు నటించిన బేబీ, తాను పనిచేసిన ఖుషి రెండూ సూపర్‌హిట్ అయ్యాయి. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని.. తాము ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేందుకు ఆలయ అధికారులు, పోలీసులు సహకరించారని విజయ్ దేవరకొండ వారికి ధన్యవాదాలు తెలిపారు.

More News

BiggBoss Telugu 7:గ్రాండ్‌గా లాంచైన ‘‘బిగ్‌బాస్-7’’ : టెస్టెంట్స్ వీరే, లిస్ట్‌లో శివాజీ, షకీలా.. ఈసారి మామూలుగా వుండదట

రోటీన్‌కు భిన్నంగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక జరిగింది. గడిచిన ఆరు సీజన్ల వరకు 21 మంది పాల్గొనగా..

Chandrababu Naidu:చెప్పినంత ఇవ్వకుంటే .. బెదిరింపులు, చంద్రబాబు 'ముడుపుల' దందా ఇలా..?

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, నిప్పులా బతికానని చెప్పుకునే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి దశాబ్ధాలుగా ఎందరో విమర్శలు చేస్తూనే వున్నారు.

ఏడో సీజన్ తో బిగ్ బాస్ వస్తున్నాడు !!

అనుక్షణం ఉత్కంఠ.. ప్రతి క్షణం ఉత్సాహం.. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని థ్రిల్.. కలగలిసిన ఒక సంచలనానికి “స్టార్ మా” సెప్టెంబర్ 3 న తెరతీయబోతోంది.

ISRO Aditya L1:అగ్రరాజ్యాలకు మరో సవాల్ విసిరిన ఇస్రో.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1

చంద్రయాన్ 3 సక్సెస్‌తో ప్రస్తుతం ఇస్రో మంచి ఊపులో వుంది. దీనిలో భాగంగా సూర్యుడిపై ప్రయోగాలకు సిద్ధమైంది.

AP Govt:ఏపీలో ఇవాళ్టీ నుంచి అందుబాటులోకి కొత్త రిజిస్ట్రేషన్ విధానం .. 20 నిమిషాల్లోనే పూర్తి, ఏంటీ కార్డ్ 2.0

తన హయాంలో ఎన్నో పాలనా సంస్కరణలను తెచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వార్డు, గ్రామ వాలంటీర్ల విధానంతో పాలనను ఇంటింటికి చేరువ చేశారు.