స్టార్ ప్రొడ్యూస‌ర్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రాలు?

  • IndiaGlitz, [Sunday,May 06 2018]

‘అర్జున్ రెడ్డి’ విజయంతో యూత్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి ప్ర‌ముఖ‌ నిర్మాతలు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ విష‌యంలో ముందు వరుసలో ఉన్నారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఈ హీరోతో అర‌వింద్‌ నిర్మించిన  ‘గీత గోవిందం’ (ప్ర‌చారంలో ఉన్న పేరు) ప్రస్తుతం  నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఇప్పుడు అల్లు అరవింద్ బాటలో మరో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కూడా వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. అశ్వనీ దత్ ఫ్యామిలీ నిర్మించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో న‌టుడిగా గుర్తింపు పొంది.. ఆ త‌రువాత‌ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ ఇప్పుడు ఆ ఫ్యామిలీ నిర్మించిన ‘మహానటి’లో కూడా నటించారు. కట్ చేస్తే.. వైజయంతి మూవీస్ పతాకంపై మ‌రో రెండు సినిమాలు చేయ‌డానికి కూడా విజ‌య్‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి డైరెక్షన్‌లో వైజయంతి మూవీస్ పతాకంపై విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. అలాగే.. డీకే రాజు దర్శకత్వంలో కూడా ఈ బ్యానర్‌పై విజయ్ మరో సినిమా చేయనున్నార‌ని స‌మాచారం. 

త్వరలోనే ఈ రెండు సినిమాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం విజయ్.. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న బైలింగ్వల్ (తెలుగు, తమిళం) ఫిల్మ్ ‘నోటా’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. జూన్ రెండో వారం నుంచి చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంతో భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు.  

More News

ఎన్టీఆర్ సినిమాలో పాట పాడ‌నున్న పెంచ‌ల్ దాస్‌?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'హల్ చల్' ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన

శ్రీరాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రుద్రాక్ష్ ఉత్కమ్-ధన్యబాలకృష్ణ జంటగా

జోరు తగ్గ‌ని 'బాహుబ‌లి 2'

గత సంవత్సరం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించి 1700 కోట్లకుపైగా వసూళ్ళు సాధించింది ‘బాహుబలి 2’.

నాదెండ్లగా సచిన్

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

'సవ్యసాచి' వాయిదా పడుతోందా?

నాగ చైతన్య, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’.