డబ్బింగ్ మొదలెట్టిన 'అర్జున్ రెడ్డి'

  • IndiaGlitz, [Tuesday,April 04 2017]

ఫస్ట్ లుక్, టీజర్ విడుదల మొదలుకొని విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్న చిత్రం "అర్జున్ రెడ్డి". విజయ్ దేవేరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో శాలిని కథానాయిక. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు.
హైద్రాబాద్, డెహ్రాడూన్, మంగళూరు, డిల్లీ, ఇటలీలోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్నప్పట్నుంచి అందరూ చిత్ర బృందాన్ని అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న "రిలీజ్ డేట్ ఎప్పుడు?" అని. అయితే.. దర్శకనిర్మాతలు రిలీజ్ డేట్ ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు కానీ.. ఇవాళ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టి.. అతి త్వరలోనే సినిమా విడుదలకానుందనే సంకేతాన్ని మాత్రం ఇచ్చారు.
దేవరకొండ విజయ్ సాయి, శాలిని, జియా శర్మ, ప్రియదర్శి, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, కాంచన తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్: రాజకృష్ణన్, సౌండ్ డిజైన్: సింక్ సినిమా, వి.ఎఫ్.ఎక్స్: హరికృష్ణ, కాస్ట్యూమ్స్: సూర్య రెడ్డి, లిరిక్స్: అనంత్ శ్రీరామ్-రాంబాబు గోసల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ వోడపల్లి, మ్యూజిక్: రాధన్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఎడిటింగ్: శశాంక్, నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగా, రచన-దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా!

More News

'సినీ మహల్ ' చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - నిర్మాత పార్థు

సినీ థియేటర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం సినీమహల్.లక్ష్మణ్ వర్మ అనే నూతన దర్శకత్వంలో కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో

ఏప్రిల్ 14న లారెన్స్ 'శివ లింగ'

అభిషేక్ ఫిలింస్ బ్యానర్పై రాఘవేంద్ర లారెన్స్,రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం 'శివలింగ'.ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది.

టైటిల్ రిజిష్టర్ చేసిందిఅందుకేనా...?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మరోసారి మల్టీస్టారర్ మూవీ రూపొందనుందని

బాలయ్య కోసం భారీ సెట్..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

తనపై వస్తున్న విమర్శలకు కీరవాణి ట్వీట్స్

బాహుబలి ప్రి రిలీజ్ వేడుకలో తెలుగుపాట అంపశయ్యపై ఉందని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చేసిన వ్యాఖ్యలకు చాలా మంది నెగటివ్ గా రియాక్ట్ అయ్యారు.