'రోషగాడు' తో సందేశాన్ని ఇవ్వనున్న విజయ్ ఆంటోని

  • IndiaGlitz, [Wednesday,February 07 2018]

పోలీస్ కథల నేపథ్యంలో సాగిన సినిమాలకి విజయాల శాతం ఎక్కువ. పోలీస్ పాత్ర‌ను చేసి విజ‌యం అందుకోని క‌థానాయ‌కుడు లేరంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే ఇప్పుడు ఈ పాత్ర‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. తిమిరు పుడిచివన్' చిత్రంతో ఆయ‌న మొదటి సారిగా పోలీస్ పాత్రలో దర్శనమివ్వబోతున్నారు. తెలుగులో రోషగాడు' పేరుతో ఈ చిత్రాన్ని అనువదించబోతున్నారు. రాజమౌళి దగ్గర స‌హాయ‌కుడిగా పనిచేసిన గణేశా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ వారంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు సినిమా గురించి మాట్లాడుతూ “ టీనేజ్..చాలా కీలకమైన వయసు. ఈ వయసులో పిల్లలకి సరైన మార్గదర్శకత్వం కావాలి. ఈ వయసులో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు సరైన మార్గంలో పెడితే...వారు కలల్ని సాకారం చేసుకుని ఉత్తమ పౌరులుగా సంఘంలో ఎదుగుతారు” అనే సందేశాన్ని విజయ్ ఆంటోనీ పాత్ర ద్వారా ఇవ్వబోతున్నామ‌ని తెలిపారు. విజయ్ ఆంటోనీ గురించి ఆయ‌న‌ మాట్లాడుతూ “పోలీస్ ఆఫీస‌ర్స్‌ బాడీ లాంగ్వేజ్, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ..నిజజీవితంలో కొంతమంది పోలీస్ ఆఫీస‌ర్ల‌ను చూసి ఆయ‌న నేర్చుకుంటున్నారు” అని తెలిపారు. ఈ సినిమాకి రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రాఫర్ కాగా...విజయ్ ఆంటోనీ సంగీతం అందించనున్నారు.

More News

హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో 'అ!'...!

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించి..‘అ!’

తారక్ , త్రివిక్రమ్ మూవీ డిటైల్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో

మ‌ల‌యాళ టైటిల్ చెప్పిన బ‌న్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులోనే కాదు మలయాళంలో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే బన్నీ సినిమాలు మలయాళంలో కూడా అనువదింపబడుతూ ఉంటాయి. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' కూడా మలయాళంలో డబ్ కానుంది.

గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం నా మనసును కలచివేసింది. - డా.మంచు మోహన్ బాబు

తిరుపతిలో చదువుకునే రోజుల్లో నేనూ, ఆయన ఒకే రూమ్ లో  ఉండేవాళ్ళం. ఆయన బ్రదర్ నా క్లాస్ మేట్. నాకు అత్యంత సన్నిహితుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఎలక్షన్స్ టైం లో ఆయన తరపున ఎన్నోసార్లు ప్రచారానికి కూడా వెళ్ళాను.

నితిన్ హీరోయిన్ మారింది

ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే వంటి చిత్రాలతో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చిన నితిన్ 25వ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత దిల్‌రాజు నిర్మాత‌గా స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌బోయే 'శ్రీనివాస క‌ల్యాణం'లో న‌టించ‌బోతున్నాడు.