ఒకరోజు ఆలస్యంగా విజయ్...

  • IndiaGlitz, [Monday,October 16 2017]

త‌మిళ హీరో విజ‌య్ తెలుగులో త‌న మార్కెట్‌ను పెంచుకోవ‌డానికి చాలా రోజులుగా ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా, విజ‌య్ త‌న ప్ర‌స్తుత చిత్రం 'అదిరింది'(త‌మిళంలో 'మెర్స‌ల్‌') సినిమాను ఈ నెల 18న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్న శ‌ర‌త్ మ‌రార్ ఒక రోజు ఆల‌స్యంగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

త‌మిళంలో సినిమా అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌వుతుంటే, తెలుగులో మాత్రం అక్టోబ‌ర్ 19న విడుద‌ల‌కానుంది. అయితే ర‌వితేజ 'రాజాది గ్రేట్‌' చిత్రం మాత్రం అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌కానుంది. అదిరింది సినిమాలో విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అట్లీ ద‌ర్శ‌కుడు.

More News

సీనియర్ బాలీవుడ్ దర్శకుడు కన్నుమూత

షమ్మీ కపూర్తో ప్రొఫెసర్ (1962), ప్రిన్స్ (1969) చిత్రాలతో పాటు రాజేంద్రకుమార్, శశికపూర్, హేమామాలిని, షబానా అజ్మీ, రేఖ, రాజేశ్ ఖన్నా వంటి స్టార్లతో సినిమాలతో పాటు...సునీల్ దత్, వైజయంతి మాలా జంటగా రూపొందిన ఆమ్రపాలి (1966) సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లేఖ్ టాండన్ ఈరోజు ముంబై పావైలో కన్నుమూశారు.

కొత్తవారితో వర్మ

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు రామ్గోపాల్ వర్మ. స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ను రాజకీయ ప్రస్థానంలోని కోణంలో చూపెట్టబోతున్నాడన రామ్ గోపాల్ వర్మ. అల్రెడి ఈ విషయంపై పలువురు రాజకీయ నాయకులు వర్మపై కామెంట్స్ కూడా చేశారు. అయితే వర్మ ఎక్కడా తగ్గలేదు.

దేవిశ్రీ..వ‌రుస‌గా మూడు నెల‌లు

ఖైదీ నెం.150, నేను లోక‌ల్‌, రారండోయ్ వేడుక చూద్దాం, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, జ‌య‌జాన‌కి నాయ‌క, జై ల‌వ‌కుశ‌.. ఇలా ఈ ఏడాదిలో ఇప్ప‌టికే ఆరు క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో సంద‌డి చేశాడు యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌. ఈ నెల 27న ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ అంటూ మ‌రో చిత్రంతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు దేవిశ్రీ‌.

'రాజా ది గ్రేట్' నిడివి ఎంతంటే..

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం రాజా ది గ్రేట్‌. వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్ అనేది దీనికి ట్యాగ్‌లైన్‌. ర‌వితేజ‌ తొలిసారిగా అంధుడిగా న‌టించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

'దండుపాళ్యం3' మోషన్‌ పోస్టర్‌ విడుదల

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది.