వెంకీ వారికి థాంక్స్ చెబుతాడట....

  • IndiaGlitz, [Sunday,July 24 2016]

హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.నాగ‌వంశీ నిర్మించిన చిత్రం 'బాబు బంగారం'. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఆగ‌స్టు 12న రానున్న ఈ సినిమాకొక విశేష‌ముంది. అదేంటంటే వెంట‌కేష్ ఈ ఆగ‌స్టు 14కు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ముప్పై ఏళ్ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా త‌న‌తో సినిమాలు చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ఆయ‌న ఈ రోజు జ‌ర‌గ‌బోయే ఆడియో వేడుక‌లో స‌త్క‌రించ‌బోతున్నాడ‌ట‌. గిబ్రాన్ అందించిన ఈ సినిమా ఆడియో వేడుక ఈరోజు(జూలై 24న‌) జ‌ర‌గ‌నుంది. ఎంటర్ టైనింగ్ పంథాలో రూపొందిన ఈ సినిమా పాట‌లు ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో సంద‌డి చేస్తున్నాయి.