మరో రీమేక్ లో వెంకీ....

  • IndiaGlitz, [Wednesday,February 10 2016]

విక్ట‌రీ వెంక‌టేష్ గ్యాప్ తీసుకుని సినిమాలు వ‌రుస బెట్టి చేస్తున్నాడు. ఇప్ప‌టికే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో బాబూ బంగారం సినిమాను విడుద‌లకు రెడీ చేస్తున్నారు. సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌గా సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమా విడుద‌ల కానుంది. త‌ర్వాత నేను..శైల‌జ పేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను చేయ‌డానికి రంగం సిద్ధం అవుతుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ నిర్మించ‌నుంది. దృశ్యం త‌ర్వాత వెంకీ మ‌రో మ‌ల‌యాళ రీమేక్‌లో న‌టించ‌డానికి రంగం సిద్ధం అవుతుంది. మ‌ల‌యాళంలో రీసెంట్‌గా విడుదలై మంచి విజ‌యాన్ని సాధించిన టు కంట్రీస్‌ చిత్రాన్ని వెంకీ హీరోగా నిర్మించున్నారట‌. ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను బండ్ల గణేష్ ద‌క్కించుకున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు తెలుస్తాయి.