వారసుడు గురించి ఎనౌన్స్ చేసిన వెంకీ

  • IndiaGlitz, [Monday,July 25 2016]

మెగాస్టార్ చిరంజీవి వార‌సుడు చ‌ర‌ణ్, నాగార్జున వార‌సులు చైత‌న్య‌, అఖిల్ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక‌ బాల‌కృష్ణ న‌ట వార‌సుడు మోక్ష‌జ్ఞ త్వ‌ర‌లో ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు. అయితే..వెంక‌టేష్ వార‌సుడు అర్జున్ వ‌య‌సులో చిన్నోడు కావ‌డంతో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి చాలా టైమ్ ఉండ‌డం వ‌ల‌న అనుకుంట ఎలాంటి వార్త‌లు రాలేదు. అయితే...బాబు..బంగారం ఆడియో వేడుక‌లో వెంక‌టేష్ త‌న న‌ట వార‌సుడు ఎంట్రీ గురించి ఎనౌన్స్ చేసి అంద‌ర్నీ స‌ర్ ఫ్రైజ్ చేసారు. ఇంత‌కీ వెంకీ ఏమ‌న్నాడంటే....గ‌త ఐదు సంవ‌త్స‌రాలు నుంచి సినిమాలు త‌గ్గించేయాలి అనుకున్నాను. అయితే..బాబు..బంగారం ట్రైల‌ర్ చూసిన‌ప్ప‌టి నుంచి ఇంకో 15 సంవ‌త్స‌రాలు సినిమాలు చేయాలి అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే....మా అబ్బాయి అర్జున్ సినిమాల్లోకి వ‌చ్చే వ‌ర‌కు న‌టిస్తాను అని చెప్పారు. అంటే...త‌న‌ వార‌సుడు అర్జున్ సినిమాల్లోకి రావ‌డం క‌న్ ఫ‌ర్మ్ అని చెప్ప‌క‌నే చెప్పేసాడు వెంకీ. ఈవిధంగా 30 వ‌సంతాలు పూర్తి చేసుకున్న శుభ సంద‌ర్భంలో వెంకీ వారసుడు గురించి ఎనౌన్స్ చేసి అభిమానుల‌కు ఆనందం క‌లిగించాడు.

More News

విశాల్ - తమన్నా మూవీకి పవర్ ఫుల్ టైటిల్..

విశాల్ - తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం తెలుగు, తమిళ్ లో రూపొందుతుంది. ఈ చిత్రానికి సూరజ్ దర్శకత్వం వహిస్తున్నారు. జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు.

నైట్ క్లబ్ బిజినెస్ లోకి బన్ని...

సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సినిమాలతో పాటు హోటల్స్, పబ్స్, ఎయిర్ వేస్ సహా పలు బిజినెస్ లలో పార్టనర్స్ గా ఉంటున్నారు. మరి కొందరైతే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూడా వ్యాపారం రంగంలోకి అడుగు పెడుతున్నాడు.

కమల్ హెల్త్ గురించి ఇంపార్టెంట్ అప్ డేట్..

యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ ఇటీవల చెన్నైలోని తన నివాసం లో మెట్ల పై నుంచి పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్ చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కమల్ కాలికి ఆపరేషన్ చేయడం జరిగింది.

200కోట్లు దాటేసిన 'కబాలి'

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి కలెక్షన్స్ సునామీ క్రియేట్ చేస్తూ ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు ఇండియా సహా 30 దేశాల్లో విడుదలైన ఈ చిత్రం రెండు వందల కోట్ల మార్కును దాటేసిందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి.

బాహుబ‌లి అయినా...పెళ్లి చూపులు అయినా ఆడియ‌న్స్ చూసేది అదే - నిర్మాత రాజ్ కందుకూరి

విజయ్ దేవ‌ర‌కొండ‌, రీతువ‌ర్మ‌, నందు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నూత‌న ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లి చూపులు. ఈ చిత్రాన్ని ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ & బిగ్ బెన్ సినిమాస్ బ్యాన‌ర్స్ పై రాజ్ కందుకూరి, య‌స్.రంగినేని సంయుక్తంగా నిర్మించారు.