వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌ ‘ఎఫ్ 3’ ప్రారంభం

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా గ‌త ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. ..‘ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‘ ట్యాగ్‌లైన్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సంక్రాంతికి అల్లుళ్లు వ‌స్తున్నారంటూ గత సంక్రాంతికి ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన సంగతి తెలిసిందే. అప్పుడే ‘ఎఫ్‌2 ’చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ని రూపొందిస్తామ‌ని అప్పుడే చిత్ర నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌క‌టించిన విధంగానే అనీల్ రావిపూడి దర్శకత్వంలో మ‌రింత ఫ‌న్ రైడ‌ర్‌గా సీక్వెల్ మూవీ ఎఫ్‌3ని లాంఛ‌నంగా ప్రారంభించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా, ఫైనాన్సియ‌ర్ ప్ర‌సాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత దిల్‌రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా..

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ - ‘‘మా బ్యానర్‌లో 2019 సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’ నవ్వుల జల్లులో ప్రేక్షకులను ముంచెత్తి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ అందరికీ తెలిసిందే. అన్నీ కుదిరితే సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ సినిమాను రూపొందిస్తామని అప్పుడే చెప్పాం. అప్పటి నుండి డైరెక్టర్ అనీల్ రావిపూడి ‘ఎఫ్ 3’ కోసం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ‘ఎఫ్ 2’ ప్రేక్షకులను ఎలా నవ్వించిందో ..దానికి మోర్ ఫన్ యాడ్ చేసి ‘ఎఫ్ 3’ కథను సిద్ధం చేశాడు. విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ ల కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను మరింత ఎంటర్ టైన్ చేయడానికి రాబోతున్నాం. డిసెంబ‌ర్ 23 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం’’ అన్నారు.

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ - ‘‘ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ కాంబినేష‌న్‌ను వెంక‌టేశ్‌-త‌మ‌న్నా, వ‌రుణ్‌తేజ్‌-మెహ్రీన్ జోడీ కాంబినేష‌న్‌తో హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మార్చి తెరకెక్కించిన ఎఫ్ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మోర్ ఫ‌న్‌ను యాడ్ చేసి ఎఫ్‌3 చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అద్భుత‌మైన క‌థ కుదిరింది. మ‌రోసారి విక్ట‌రీ వెంక‌టేశ్‌గారు, వ‌రుణ్ తేజ్‌గారు, త‌మ‌న్నా, మెహ్రీన్ జంట‌లు మిమ్మ‌ల్ని న‌వ్వుల్లో ముంచెత్తుతారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో మ‌రోసారి వ‌ర్క్ చేయ‌డం ఎంతో హ్యాపీగా ఉంది’’ అన్నారు.

న‌టీన‌టులు: వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ త‌దిత‌రులు

More News

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘వకీల్‌సాబ్’ పిక్స్..

బాలీవుడ్ సినిమా ‘పింక్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నారు.

రూ.30 కోట్లు దానం చేసి ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచింది..

నాలుగు నెలల్లో చేతికి ఎముకలేదన్నట్టుగా రూ.30 కోట్లు దానం చేసింది. అయినా కూడా ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మహిళల లిస్టులో అగ్ర స్థానంలో నిలిచింది.

బ్ర‌హ్మాజీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ‘హ్యాంగ్ మ్యాన్‘ షూటింగ్ పూర్తి.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

బ్ర‌హ్మాజీ.. తెలుగు సినీ ప్రేక్ష‌కాభిమానుల‌కు ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌.. డిఫ‌రెంట్ మేన‌రిజ‌మ్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డం ఆయ‌న‌కే చెల్లింది.

బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌తో.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా: మోనాల్

బిగ్‌బాస్ షో నుంచి గత ఆదివారం ఎలిమినేట్ అయిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ తన సినీ, పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది.

ఎన్టీఆర్ స్పెష‌ల్ షో.. షాకింగ్‌ రెమ్యున‌రేష‌న్‌..?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’ చిత్రీకరణలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బిజీగాఉన్న సంగ‌తి తెలిసిందే.