టెలివిజ‌న్ సిరీస్ స్ఫూర్తితో వెంకీ, తేజ చిత్రం?

  • IndiaGlitz, [Tuesday,November 28 2017]

నేనే రాజు నేనే మంత్రితో ప‌దిహేనేళ్ల త‌రువాత విజ‌యాన్ని అందుకున్నారు ద‌ర్శ‌కుడు తేజ‌. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నారు. వాటిలో ఒక‌టి న‌ట‌సింహ‌ బాల‌కృష్ణ‌తో రూపొందించనున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ కాగా.. మ‌రొక‌టి వెంక‌టేష్‌తో తెర‌కెక్కించ‌నున్న చిత్రం. వీటిలో ముందుగా వెంకీ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.

డిసెంబ‌ర్ 13న ప్రారంభం కానున్న ఈ సినిమాపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వినిపిస్తోంది. అదేమిటంటే.. ఈ సినిమాని అమెరిక‌న్ టెలివిజ‌న్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్ ఆధారంగా తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలిసింది. తెలుగు నేటివిటికి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేస్తున్నార‌ని స‌మాచార‌మ్‌.

వెంక‌టేష్ ప్రొఫెస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నాలుగైదు నెల‌ల్లో సినిమాని పూర్తిచేసి.. వేస‌వి కానుక‌గా సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

More News

మూడు రోజుల పండ‌గ

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ క్రిస్మ‌స్ ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. పండ‌గ సంద‌ర్భంలో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు విడుద‌ల కానుండ‌డ‌మే అందుకు కార‌ణంగా చెప్పొచ్చు.

6 కోట్లకు అల్లు శిరీష్ ఒక్క క్షణం ఆంధ్రా హక్కులు

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ డైరెక్షన్ లో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్

పవన్ ని ఆకాశానికెత్తేసిన కీర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ నిన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వారణాసిలో ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటోంది.

ప్రాజెక్ట్ z.. అడ్డంకులు తొలగిపోయాయి

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘మాయవన్’. ఇదొక సైన్స్ ఫిక్షన్ క్రైమ్ మిస్టరీ ఫిలిం. దీనిని ‘ప్రాజెక్ట్ z’ అనే పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు.

అన్నయ్యని డైరెక్ట్ చేస్తానంటున్న తమ్ముడు

ఆవారా, నాపేరు శివ, ఊపిరి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు కార్తి. ‘ఖాకి’ సినిమా విజయంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు ఈ యువ కథానాయకుడు.