Saindhav:'ఈసారి లెక్క మారుద్ది' అంటున్న వెంకీ మామ.. యాక్షన్ థ్రిల్లర్‌గా 'సైంధవ్' టీజర్‌..

  • IndiaGlitz, [Monday,October 16 2023]

టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత సోలో హీరోగా నటిస్తున్న చిత్రం 'సైంధవ్'. వెంకీ కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా పాన్ ఇండియా మూవీలో వెంకటేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ చూస్తుంటే వెంకీ మామ వైల్డ్ పాత్రలో ఇరగదీశాడు. వెళ్లే ముందే చెప్పి వెళ్లాను వినలేదు.. అంటే భయం లేదు ఈసారి లెక్క మారుద్ది అంటూ విలన్స్‌కు వెంకీ వార్నింగ్ ఇస్తున్న సీన్ సినిమాపై హైప్స్ పెంచేసింది.

వెంకీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరెకెక్కుతున్న మూవీ..

భార్య, కూతురితో సంతోషంగా జీవించే హీరో.. విలన్స్‌ ఆగడాలను ఎలా అడ్డుకోనున్నట్లు టీజర్‌లో చూపించారు. ఇందులో విలన్‌గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించాడు. సైకో విలన్‌గా తన లక్ష్యం కోసం ఘోరంగా చంపేసే పాత్రలో జీవించాడు. ఇక దాదాపు 20వేల మంది పిల్లలకు గన్స్ వినియోగంలో శిక్షణ ఇచ్చి సంఘ విద్రోహ శక్తులుగా వారిని తీర్చిదిద్దడం చూస్తుంటే ఈ సినిమాను ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తీసినట్లు అర్థమవుతోంది. వెంకీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుండటం విశేషం.

అతిథి పాత్రలో తమిళ స్టార్ హీరో 'ఆర్య'.

'హిట్', 'హిట్ 2' వంటి థ్రిల్లర్ సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న డాక్టర్.శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని కూడా తనదైన శైలిలో క్రైమ్ థ్రిల్లర్‌గా తీసినట్లు టీజర్‌లో చూపించారు. ఈ మూవీలో వెంకటేష్‌కి జోడిగా జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, జయప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ హీరో ఆర్య కూడా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఫిల్మ్‌ నగర్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

More News

Prithviraj:ప్రభాస్ 'సలార్' మూవీ నుంచి పృథ్వీరాజ్ కొత్త పోస్టర్ విడుదల..

దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న మూవీల్లో 'సలార్' ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో

CM Jagan:డిసెంబర్‌లోపు విశాఖ నుంచే పరిపాలన.. సీఎం జగన్ క్లారిటీ..

విశాఖపట్టణం నుంచి పరిపాలనపై సీఎం జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ లోపు తాను వైజాగ్ నుంచే పాలన చేయనున్నట్లు తెలిపారు.

Former Bhadrachalam MLA:తెలంగాణ బీజేపీలో విషాదం.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు.

Bigg Boss 7 Telugu : మళ్లీ అమ్మాయే.. నయని పావని ఎలిమినేషన్, ఇంటి సభ్యులంతా కంటతడి .. ఎమోషనలైన నాగ్

బిగ్‌బాస్ సీజన్ 7లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురిని ఇంటిలోకి పంపించిని బిగ్‌బాస్..

YSRCP Social Media: లండన్‌లో ఘనంగా వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం..భారీగా హాజరైన కార్యకర్తలు

రాష్ట్రం సంక్షేమం కోసం సీఎం జగన్ అనుక్షణం ఎంతో కష్టపడుతున్నారని సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి తెలిపారు.