మళ్ళీ వార్తల్లోకి వెంకీ, పూరీ కాంబినేషన్

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్‌ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ ఫిలిం వర్గాలు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. గత ఏడాదే ఈ ఇద్దరి కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోందని వార్తలు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టుకి కొంత ఆల‌స్యం జ‌రిగింది. ఆ త‌రువాత అనూహ్యంగా వెంకటేష్‌.. తేజతో సినిమా చేయడానికి సిద్ధపడి పోయారు.

అలాగే పూరి జగన్నాథ్‌ కూడా తన కొడుకు ఆకాష్‌ని హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా' సినిమాతో బిజీ అయిపోవడంతో.. ఇక ఈ ఇద్ద‌రి కలయికలో మూవీ దాదాపుగా లేదనే నిర్ణయానికి ఇండస్ట్రీ వర్గాలు కూడా వచ్చేసాయి. ఇదిలా ఉంటే...ప్రస్తుతం తేజ, బాలకృష్ణ ప్రధాన పాత్ర‌ధారిగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాని తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ చిత్రం తర్వాతే వెంకీతో సినిమా చేయనున్నారని సమాచారం. ఇక పూరి మెహబూబా' సినిమా కూడా క్లైమాక్స్ కి చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మళ్ళీ వెంకీ, పూరి ద్వయం చేయికలుపుతున్నారని ఇన్‌సైడ్‌ సోర్స్ టాక్. త్వ‌రలోనే ఈ సినిమాపై క్లారిటీ వ‌స్తుంది.

More News

కేరళ ప్రమెషన్ లో భాగమతి టీం

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్ తొ సహ అన్ని ప్రమెషనల్ మెటిరియల్స్ కి

మ‌రో మెగా హీరోతో అను

సంక్రాంతికి విడుద‌లైన 'అజ్ఞాత‌వాసి' చిత్రంలో ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జోడీగా సంద‌డి చేసింది కేర‌ళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్‌. సూర్యకాంతం పాత్ర‌లో అమాయ‌కంగా కనిపించిన ఈ సుంద‌రి.. ప్ర‌స్తుతం మ‌రో మెగా హీరో, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే చేస్తోంది.

ఆ ద‌ర్శ‌కుల‌కి ఓకే చెప్పిన గోపీచంద్‌

కుటుంబకథా చిత్రాల్లోనే మాస్, యాక్షన్ అంశాలను కూడా ఉండేటట్లు చూసుకునే క‌థానాయ‌కుడు గోపీచంద్. ఇటువంటి కథలతోనే ఒకప్పుడు వరుస హిట్లను అందుకున్న ఈ యాక్ష‌న్‌ హీరోకి.. 'లౌక్యం' త‌రువాత చేసిన సినిమాలేవీ విజ‌యాల‌ను అందించ‌లేక‌పోయాయి. ప్రస్తుతం డెబ్యు డైరెక్టర్ చక్రి దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని చేస్తున్నారు గోపీచంద్. మ

నాగ్‌, నాని.. డేట్ ఫిక్స‌య్యింది

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్లీస్టార‌ర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న‌ ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో కనిపించనుండగా...నాని డాక్టర్ పాత్రలో మెప్పించనున్నారని సమాచారం.  ఈ చిత్రాన్ని భ‌లే మంచి రోజు, శమంత‌క‌మ‌ణి చిత్రాల ద‌ర్శ‌కుడు శ్ĸ

ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా అనసూయ

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న గాయత్రి చిత్రం ఫిబ్రవరి 9 న విడుదల కానుంది. సంక్రాంతికి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా, 'రాయలసీమ రామన్న చౌదరి' తరహాలో మోహన్ బాబు ఓ పవర్ఫుల్ రోల్ లో కనిపించనుండటంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.